News March 7, 2025
సిద్దిపేట: వడదెబ్బ జాగ్రత్తలు తెలపాలి: అదనపు కలెక్టర్

ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు తెలపాలని సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ గరీమా అగర్వాల్ వైద్యాధికారులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్లో హీట్ రిలేటెడ్ ఇళ్లనేస్ (ఎండ తీవ్రతతో వచ్చే ఆరోగ్య సమస్యల పైన) జిల్లాల అధికారుల సమన్వయ సమావేశాన్ని, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పల్వాన్ కుమార్తో కలిసి సమావేశాన్ని నిర్వహించారు.
Similar News
News December 17, 2025
జనవరి 1న ‘భారత్ టాక్సీ’ ప్రారంభం

ప్రయాణికులకు, డ్రైవర్లకు భారీ ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం ‘భారత్ టాక్సీ’ యాప్ను జనవరి 1 నుంచి ప్రారంభించనుంది. ఉబర్, ఓలా వంటి ప్రైవేట్ క్యాబ్ సర్వీసులకు దీటుగా దీనిని తీసుకొస్తోంది. తొలుత ఢిల్లీలో ప్రయోగాత్మకంగా ప్రారంభించి తరువాత దేశవ్యాప్తంగా విస్తరించనుంది. ప్రైవేట్ క్యాబ్ సర్వీసుల తరహాలో ఇందులో అధిక ఛార్జీలు ఉండవు. ఇప్పటికే 56 వేల మందికిపైగా డ్రైవర్లు రిజిస్టర్ చేసుకున్నట్లు సమాచారం.
News December 17, 2025
గోవా నుంచి తిరుపతికి.. అక్కడ నుంచి నెల్లూరుకి..

నెల్లూరు కార్పొరేషన్కి చెందిన 40 మంది కార్పొరేటర్లు కుటుంబ సభ్యులతో గోవాలో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. వారు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు గోవా నుంచి తిరుపతికి రానున్నారు. అక్కడి నుంచి రేపు ఉదయం నేరుగా కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుంటారు. రేపు కార్పొరేషన్ ఆఫీస్లో సమావేశం ఉంటుంది. ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మేయర్ రాజీనామాకు ఆమోదం తెలపనున్నారు.
News December 17, 2025
22న మామిడి రైతుల చలో కలెక్టరేట్

చిత్తూరు: మామిడి రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఈనెల 22న చలో కలెక్టరేట్ నిర్వహించనున్నట్లు రైతు సంఘం నాయకులు తెలిపారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో మామిడి రైతు సంఘ విస్త్రృతస్థాయి సమావేశం మంగళవారం నిర్వహించారు. సంఘ అధ్యక్ష, కార్యదర్శులు మునీశ్వర్ రెడ్డి, మురళి ప్రసంగించారు. జిల్లాలోని 40వేల మంది రైతులకు రూ.360 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. రైతుల అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.


