News February 7, 2025

సిద్దిపేట: సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి: DMHO

image

ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని సిద్దిపేట డీఏంహెచ్‌ఓ పాల్వన్ కుమార్ సూచించారు. గురువారం జిల్లాలోని జగదేవ్ పూర్, తీగుల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఆరోగ్య కార్యక్రమాల పనితీరును రికార్డుల ద్వారా తెలుసుకున్నారు. తర్వాత ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్‌లలో నిర్వహిస్తున్న పరీక్ష నమూనాలను పరిశీలించారు.

Similar News

News February 7, 2025

కాళ్ల: స్థల వివాదమే హత్యకు కారణం

image

కాళ్ల మండలం పెదఅమిరం గ్రామంలో తమ్ముడిని అన్న హత్య చేసిన ఘటనకు స్థలం గొడవే కారణంగా తెలుస్తోంది. తమ తల్లికి చెందిన సెంటు స్థలం కోసం అన్న రమేశ్, తమ్ముడు సత్యనారాయణ మధ్య వివాదం నడుస్తోంది. 2023లో ఒకరిపై ఒకరు కేసు పెట్టుకుని రాజీ పడ్డారు. ఆ తర్వాత కూడా గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం సాయంత్రం అన్న ఇంటికి వెళ్లి రమేశ్ గొడవపడ్డాడు. సత్యనారాయణ తలపై బలంగా కొట్టడంతో రమేశ్ మృతి చెందాడు. కేసు నమోదైంది.

News February 7, 2025

ఇకపై లేఖర్ల అవసరం లేదు: డీఐజీ

image

ఆస్తి రిజిస్ట్రేషన్లకు ఇకనుంచి లేఖర్లు అవసరం లేదని రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ జి.బాలకృష్ణ తెలిపారు. గురువారం ఆయన మాడుగుల రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించారు. రిజిస్ట్రేషన్లు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరికి వారే రిజిస్ట్రేషన్లు చేయించుకోవచ్చునని పేర్కొన్నారు. ఆస్తి కొనుగోలుదారులు చలానా తీసిన వెంటనే అన్ని ఆన్‌లైన్‌లో పొందుపరుస్తామన్నారు.

News February 7, 2025

TCS ఉద్యోగులకు షాక్.. వేరియబుల్ పేలో భారీ కోత

image

ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ సీనియర్ ఉద్యోగులకు షాకిచ్చింది. 2024-25 Q3లో వారి వేరియబుల్ పేలో భారీ కోత పెట్టినట్లు నేషనల్ మీడియా పేర్కొంది. ఆఫీసుకు వచ్చి పనిచేస్తున్నప్పటికీ వరుసగా రెండో క్వార్టర్‌లోనూ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. తొలి త్రైమాసికంలో 70 శాతం వేరియబుల్ పే అలవెన్స్ ఇవ్వగా, Q2లో 20-40 శాతానికి పరిమితం చేసింది. తనకు 50K-55K రావాల్సి ఉండగా Q2లో సగం, Q3లో ఇంకా తగ్గిందని ఓ ఉద్యోగి చెప్పారు.

error: Content is protected !!