News December 20, 2024

సిబ్బంది సమస్యల పరిష్కారం కోసమే గ్రీవియన్స్ డే: ఎస్పీ

image

పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారం కోసమే గ్రీవియన్స్ డే నిర్వహిస్తున్నట్లు నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం పోలీసు గ్రీవియన్స్ డే నిర్వహించారు. నంద్యాల జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లు ఆయా విభాగాలలో విధులు నిర్వహిస్తున్న 9 మంది సిబ్బంది మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్, మెడికల్ గ్రౌండ్స్, రిక్వెస్ట్ బదిలీల గురించి ఎస్పీకి స్వయంగా విన్నవించుకున్నారు.

Similar News

News February 5, 2025

కర్నూలు APSP బెటాలియన్ కమాండెంట్‌గా దీపిక బాధ్యతల స్వీకరణ

image

కర్నూలు ఏపీఎస్పీ 2వ బెటాలియన్ కమాండెంట్‌గా దీపిక పాటిల్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పోలీసుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని వెల్లడించారు. ముందుగా బెటాలియన్ అధికారుల నుంచి ఆమె గౌరవ వందనం స్వీకరించారు. అడిషనల్ కమాండెంట్ మెహబూబ్ బాషా, తదితరులు పాల్గొన్నారు.

News February 5, 2025

కుటుంబానికి 100 రోజులు పని కల్పించాలి: కలెక్టర్

image

ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి రోజూ లక్ష మందికి ఉపాధి పనులు కల్పించాలని ఏపీడీ, ఎంపీడీవో, ఏపీవోలను కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు.ఉపాధి హామీ పనుల పురోగతి అంశంపై ఏపీడీలు, ఎంపీడీవోలు, ఏపీవోలతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సమీక్ష నిర్వహించారు. పనుల కల్పనలో వెనుకబడిన అధికారులతో మాట్లాడారు. కుటుంబానికి 100 రోజుల పని కల్పించాలన్నారు.

News February 5, 2025

పారా అథ్లెటిక్స్‌లో ఎమ్మిగనూరు డిగ్రీ విద్యార్థి ఘనత

image

గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈనెల 2న జరిగిన 7వ రాష్ట్రస్థాయి పారా అథ్లెటిక్స్‌లో ఎమ్మిగనూరు శ్రీ మహాయోగి లక్ష్మమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి పింజారి బషీర్ సత్తా చాటాడు. 100 మీటర్లు, 1,500 మీటర్ల పరుగు పందెంలో మొదటి స్థానం సాధించాడు. ఈ విజయంతో కళాశాలకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు వచ్చిందని కళాశాల అధ్యక్షుడు డా.మహబూబ్ బాషా పేర్కొన్నారు. బషీర్‌ను కళాశాల అధ్యాపక సిబ్బంది అభినందించారు.

error: Content is protected !!