News July 1, 2024

సిరిసిల్ల: కానిస్టేబుల్‌పై హత్యాయత్నం.. వ్యక్తి అరెస్టు

image

కానిస్టేబుల్‌పై హత్యాయత్నానికి పాల్పడిన ఇసుక స్మగ్లర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. SP అఖిల్ మహాజన్ ప్రకారం.. రామలక్ష్మణపల్లె మానేరు వాగు నుంచి అక్రమంగా తరలిస్తున్న 5 ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని పోలీసులు స్టేషన్‌కు తరలిస్తున్నారు. ఈక్రమంలో గురుబాబు(30) అనే వ్యక్తి ట్రాక్టర్‌ను నడిపి చెరువులోకి తోసివేశాడు. కాగా, ఆ సమయంలో ట్రాక్టర్‌పై కానిస్టేబుల్ సత్యనారాయణ ఉండటంతో తీవ్ర గాయాలయ్యాయి.

Similar News

News September 21, 2024

జగిత్యాల: తీవ్ర జ్వరంతో బాలుడు మృతి

image

జగిత్యాల జిల్లాలో విషాదం నెలకొంది. స్థానికుల ప్రకారం.. రాయికల్ పట్టణానికి చెందిన మనీశ్(6) జ్వరంతో మృతి చెందాడు. పది రోజుల క్రితం జ్వరం రావడంతో జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించగా కోలుకున్నాడు. మళ్లీ రెండు రోజుల క్రితం జ్వరం రావడంతో పరీక్షలు చేయించారు. డెంగ్యూగా నిర్ధారణ కావడంతో కుటుంబీకులు కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అక్కడే ఫిట్స్ వచ్చి మృతి చెందాడు.

News September 21, 2024

కరీంనగర్: బాలికపై లైంగిక వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు

image

KNR జిల్లా వీణవంక మండలంలోని ఓ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. SI తిరుపతి ప్రకారం.. మండలంలోని ఐదో తరగతి చదువుతున్న ఓ పదకొండేళ్ల బాలికపై 30 ఏళ్ల వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడటంతో బాధిత కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈనెల 16న కేసు నమోదు చేయగా.. శుక్రవారం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. బాలిక అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న వ్యక్తి గత కొన్ని రోజులుగా వేధింపులకు గురి చేశాడు.

News September 21, 2024

జగిత్యాల: మహిళా శక్తి కార్యక్రమాల అమలుపై కలెక్టర్ సమీక్ష

image

జగిత్యాల కలెక్టరేట్లో శుక్రవారం మహిళా శక్తి కార్యక్రమాల అమలుపై కలెక్టర్ సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక బృందాలకు సాధికారత కల్పించడానికి, అన్ని జీవనోపాధి అంశాలలో వారిని బలోపేతం చేయడానికి మహిళా శక్తి కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు. మహిళా శక్తి కింద వచ్చే ఐదేళ్లలో మైక్రో ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ద్వారా ప్రణాళికలు రూపొందించబడ్డాయన్నారు.