News February 4, 2025
సిరిసిల్ల: జిల్లా BJP అధ్యక్షుడు ఎవరో..?
బీజేపీ నూతన అధ్యక్షుల ప్రకటనలో భాగంగా 27 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించారు. మిగతా 11 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించాల్సి ఉంది. రెడ్డి, మున్నూరు కాపులకు 6, 4-గౌడ్స్, వైశ్య, ఎస్సీలకు 2, కమ్మ, ఆర కటిక, పద్మశాలీ, పెరిక, ముదిరాజ్లకు 1 చొప్పున BJP అధ్యక్షులను నియమించింది. అయితే ఇప్పటివరకు సిరిసిల్ల అధ్యక్షుడినైతే ప్రకటించలేదు.కాగా జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Similar News
News February 4, 2025
రతన్ టాటా యువ స్నేహితుడికి కీలక పదవి
దివంగత వ్యాపారవేత్త రతన్ టాటా యువ స్నేహితుడు శంతను నాయుడుకు టాటా కంపెనీలో కీలక పదవి దక్కింది. స్ట్రాటజీస్ ఇనిషియేటివ్స్ విభాగానికి హెడ్, GMగా నియమితులైనట్లు శంతను LinkedInలో పోస్ట్ చేశారు. తన తండ్రి టాటా మోటార్స్ ప్లాంట్లో పని చేసేటప్పుడు వైట్ షర్ట్, నేవీ కలర్ ఫ్యాంట్ ధరించేవారని పేర్కొన్నారు. ఆయన కోసం తాను కిటికీ దగ్గర కూర్చొని ఎదురు చూసేవాడినని చిన్నప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు.
News February 4, 2025
BREAKING: నాగర్కర్నూల్లో దారుణం.. తల్లిని చంపేశాడు!
నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మహాదేవునిపేటలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన యాదమ్మ కుమారుడు కరుణాకర్ మద్యంతో పాటు డ్రగ్స్కు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కోపంతో కన్నతల్లిని గోడకేసి కొట్టి అతి కిరాతకంగా హత్య చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 4, 2025
BREAKING: నాగర్కర్నూల్లో దారుణం.. తల్లిని చంపేశాడు!
నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మహాదేవునిపేటలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన యాదమ్మ కుమారుడు కరుణాకర్ మద్యంతో పాటు డ్రగ్స్కు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కోపంతో కన్నతల్లిని గోడకేసి కొట్టి అతి కిరాతకంగా హత్య చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.