News February 6, 2025
సిరిసిల్ల జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడిగా కుర్ర రాకేశ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738835224602_51806305-normal-WIFI.webp)
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్ఎఫ్ఐ నూతన అధ్యక్షుడిగా కుర్ర రాకేశ్, కార్యదర్శిగా మల్లారపు ప్రశాంత్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా రాకేశ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడుతానని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని పేర్కొన్నారు.
Similar News
News February 6, 2025
రూ.72 లక్షలు పెట్టి కష్టపడి వెళ్లినా..
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738857031093_367-normal-WIFI.webp)
అమెరికా పిచ్చితో హరియాణాకు చెందిన ఆకాశ్ (20) 2.5 ఎకరాల భూమి అమ్మి రూ.65 లక్షలతో అక్రమ మార్గంలో US వెళ్లాడు. ఏజెంట్లకు మరో రూ.7 లక్షలు చెల్లించాడు. పనామా, మెక్సికో మార్గంలో ఎన్నో కష్టాలు భరించి అక్కడికి వెళ్లానని తెలిపాడు. తాజాగా ఆకాశ్ను అమెరికా ప్రభుత్వం ఇండియాకు పంపడంతో కన్నీరుమున్నీరవుతున్నాడు. కాగా పంజాబ్, హరియాణా యువకుల్లో చాలా మందికి ఇంగ్లిష్పై పట్టు లేక US వీసాలు పొందలేకపోతున్నారు.
News February 6, 2025
పాడేరు: పర్యాటక గమ్యస్థానాల అభివృద్ధికి ప్రణాళికలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738846166629_15122836-normal-WIFI.webp)
పర్యాటక గమ్యస్థానాల అభివృద్ధికి సమగ్రమైన ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ సూచించారు. గురువారం కలెక్టరేట్లో అరకు చలి ఉత్సవంలో పాల్గొన్న అధికారులతో సమావేశం నిర్వహించారు. టూరిజం ప్రాంతాలను అభివృద్ధి చేసి, సంబంధిత గ్రామాలకు నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తే గిరిజనులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో పంచాయతీరాజ్, అటవీశాఖ, గిరిజన చట్టాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు.
News February 6, 2025
త్వరలో వాట్సాప్లోనే బిల్స్ కట్టేయొచ్చు!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738857921373_893-normal-WIFI.webp)
వాట్సాప్ ద్వారా కరెంటు బిల్లు, ఫోన్ రీఛార్జ్, LPG గ్యాస్, వాటర్ బిల్స్ కట్టే ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఇతర యాప్లతో పనిలేకుండా ఇందులో నుంచే బిల్ పేమెంట్స్ చేసేయొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉంది. కాగా భారత్లోని సెలక్టెడ్ యూజర్లకు ఈ యాప్ 2020లో మనీ ట్రాన్స్ఫర్ ఫీచర్ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆ సేవలను యూజర్లందరికీ విస్తరించింది.