News March 27, 2025
సిరిసిల్ల: మాదకద్రవ్యాలను నిర్మూలించాలి: కలెక్టర్

అన్ని శాఖల అధికారుల సమన్వయంతో మాదక ద్రవ్యాలను నిర్మూలించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని జిల్లా స్థాయి నార్కో సమన్వయ సమావేశాన్ని గురువారం కలెక్టర్, ఎస్పీ మహేష్ బి గితే సమక్షంలో అధికారులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్ నిర్మూలించాలన్నారు.
Similar News
News April 1, 2025
భార్యకు పెళ్లి చేసిన భర్త.. ఊహించని మలుపు

UP: భర్తే తన భార్యను ప్రియుడికిచ్చి <<15898025>>పెళ్లి చేసిన ఘటనలో<<>> సినిమా లెవల్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రియుడు వికాస్తో వెళ్లిపోయిన రాధిక మళ్లీ మొదటి భర్త బబ్లూ చెంతకు చేరింది. భార్యకు దూరమై పిల్లలిద్దరి బాధ్యత చూసుకుంటూ బబ్లూ అనుభవించే బాధ గురించి వికాస్ తల్లి తన కొడుక్కి అర్థమయ్యేలా చెప్పింది. దీంతో వికాస్ రాధికను తిరిగి బబ్లూ వద్దకు పంపాడు. తన భార్యను స్వీకరిస్తానని బబ్లూ పంచాయతీలో ఒప్పుకున్నాడు.
News April 1, 2025
కృష్ణా జిల్లాలో TODAY TOP NEWS

☞కృష్ణా : ప్రశాంతంగా ముగిసిన పది పరీక్షలు ☞జూన్లో విజయవాడ వెస్ట్ బైపాస్ ఓపెన్ ☞ ప్రవీణ్ పగడాల మృతి కేసు.. ఎస్పీ హెచ్చరికలు ☞ కృష్ణా: చిన్నారి మృతి.. హృదయ విదారకం ☞ఉంగుటూరు: వారిని పట్టిస్తే రూ.10 వేలు ☞కృష్ణా: జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ☞కృష్ణా: Way2Newsతో మాట్లాడిన10th విద్యార్థులు ☞ గన్నవరం: వంశీకి షాక్.. రిమాండ్ పొడిగింపు
News April 1, 2025
గద్వాల: NSUI సంఘం నేతలపై పెట్టిన కేసు కొట్టివేత

గత ప్రభుత్వ హయాంలో విద్యార్థి సంఘాల నేతలపై పెట్టిన కేసులతో తీవ్ర ఇబ్బంది పడ్డారని, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని న్యాయబద్ధంగా పోరాడితే అక్రమంగా అరెస్ట్ చేసి కేసులు బనాయించారని NSUI గద్వాల జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్ తెలిపారు. ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ చొరవతో న్యాయవాది సురేశ్ గౌడ్ నేతృత్వంలో తనపై పెట్టిన 491/21 కేసును కొట్టివేస్తూ గద్వాల జడ్జి తీర్పునిచ్చారని తెలిపారు.