News February 5, 2025
సిరిసిల్ల: సీఎం నోట ‘KTR ఆత్మహత్య’.. మీ కామెంట్?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738732946065_718-normal-WIFI.webp)
అసెంబ్లీలో కాంగ్రెస్, BRS మధ్య రాజకీయం వేడెక్కింది. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయని కొందరు మాట్లాడుతున్నారని, అలాంటివేమీ రావని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘KTR ఏమైనా ఆత్మహత్య చేసుకుంటారా.. సిరిసిల్లకు ఉపఎన్నిక రావడానికి?’ అని అన్నారు. ఉప ఎన్నికలు వస్తాయని KTR చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాము ఎన్నికల కోసం కులగణన చేయలేదని, ప్రజల అభివృద్ధి కోసమే చేశామని స్పష్టం చేశారు.
Similar News
News February 5, 2025
సిరిసిల్ల జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షుడిగా కృష్ణారెడ్డి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738750393159_51806305-normal-WIFI.webp)
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన గుండారపు కృష్ణారెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. తన ఎన్నికకు సహకరించిన రెడ్డి కుల బాంధవులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రెడ్డి సంఘం నాయకులు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆగయ్య, ఎల్లారెడ్డిపేట మాజీ జెడ్పిటిసి లక్ష్మణరావు, సెస్ డైరెక్టర్ కృష్ణ హరి నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
News February 5, 2025
అనకాపల్లి: ‘దరఖాస్తుల స్వీకరణకు గడువు పెంపు’
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738750905637_19090094-normal-WIFI.webp)
అనకాపల్లి జిల్లాలో గీత కులాల వారికి కేటాయించిన 15 మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణకు గడువును ఈనెల 5 నుంచి 8వ తేదీ వరకు పొడిగించినట్లు అనకాపల్లి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి వి.సుధీర్ ఒక ప్రకటనలో తెలిపారు. వీరు సాధారణ లైసెన్స్ ఫీజులో సగం మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. గీత కులాల వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
News February 5, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738750605432_19090094-normal-WIFI.webp)
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై బుధవారం కలెక్టరేట్లో ఎస్పీ తుహీన్ సిన్హాతో కలిసి సమీక్షించారు. ఈనెల 27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు జిల్లాలో 24 పోలింగ్ స్టేషన్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సిబ్బందిని నియమించి శిక్షణ ఇవ్వాలన్నారు.