News April 20, 2025

సిరిసిల్ల :సోమవారం ప్రజావాణి రద్దు

image

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో సోమవారం కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం తెలిపారు. ప్రజలు వినతులు ఇవ్వడానికి కలెక్టరేట్‌కు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఈనెల 21 సోమవారం హై కోర్టు కేసు విషయంలో వ్యక్తిగతముగా హాజరవుతున్న కారణంగా అందుబాటులో ఉండటం లేదన్నారు. ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

Similar News

News April 20, 2025

మెగాస్టార్ మూవీ.. VFX కోసం రూ.75 కోట్లు?

image

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న ‘విశ్వంభర’లో కీలకంగా ఉన్న VFX కోసం భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం వీటి కోసమే UV క్రియేషన్స్ రూ.75 కోట్లు వెచ్చించినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. హాలీవుడ్ చిత్రాలకు వర్క్ చేసిన ప్రముఖ వీఎఫ్ఎక్స్ స్టూడియోలతో పనిచేస్తున్నట్లు వెల్లడించాయి. ఈ సోషియో ఫాంటసీ మూవీకి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా జులైలో విడుదల కానున్నట్లు సమాచారం.

News April 20, 2025

గుంటూరు: 19 పరుగులు చేసిన రషీద్

image

వాంఖండే వేదికగా జరుగతున్న చైన్నై -ముంబాయి మ్యాచ్‌లో గుంటూరు కుర్రోడు షేక్ రషీద్ ఆదివారం పర్వాలేదనింపించారు. ఓపెనర్‌గా వచ్చి 20 బంతుల్లో 19 పరుగులు చేశాడు. అందులో మూడు ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. శాంట్నర్ వేసిన బౌలింగ్‌లో స్టంప్ అవుట్ అయ్యి వెనుదిరిగారు. కాగా.. దీనికంటే ముందు మ్యాచ్‌లో ఆరంగేట్రం చేసిన రషీద్ 27 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

News April 20, 2025

నెల్లూరులో రాష్ట్రస్థాయి చెస్ పోటీలు ప్రారంభం

image

నెల్లూరు జిల్లా చెస్ అసోసియేషన్ శ్రీ ఆనంద్ చెస్ వింగ్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని సిల్వర్ బాక్స్ పాఠశాలలో రాష్ట్రస్థాయి చెస్ పోటీలను అప్సానాతో వెంకటాద్రి నాయుడు, చెస్ రాష్ట్ర కార్యదర్శి సుమన్‌ ఆదివారం ప్రారంభించారు. 280 మంది క్రీడాకారులు 2 ఉభయ రాష్ట్రాల నుంచి పోటీల్లో పాల్గొన్నారు. గెలుపొందిన విజేతకు నగదగతో పాటు, మెమొంటో, ప్రశంసా పత్రం అందజేస్తారని గోపీనాథ్, డాక్టర్ మధు తెలిపారు.

error: Content is protected !!