News February 6, 2025
సీఎం నియోజకవర్గంలో విద్యార్థులు రోడ్డెక్కే పరిస్థితి: హరీశ్ రావు
మధ్యాహ్న భోజనం పథకం బాగాలేదని విద్యార్థులు వారి తల్లిదండ్రులు సాక్షాత్తు సీఎం సొంత నియోజకవర్గంలోనే రోడ్డు ఎక్కే పరిస్థితి నెలకొందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ‘X’ లో విమర్శించారు. సీఎం నియోజకవర్గం కోస్లి మండలం చెన్నారం పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డెక్కిన ఫోటోలు పోస్ట్ చేశారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి పనితీరు ఎట్లా ఉందో కోస్లి పాఠశాల దుస్థితి చూస్తే తెలుస్తుందన్నారు.
Similar News
News February 6, 2025
TG భరత్కు 15వ ర్యాంకు
మంత్రుల పనితీరు ఆధారంగా సీఎం చంద్రబాబు ర్యాంకులు కేటాయించారు. మంత్రులుగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి గత డిసెంబర్ వరకు ఫైళ్లను త్వరగా క్లియర్ చేసిన వారికి మెరుగైన ర్యాంకు లభించింది. ఈక్రమంలో కర్నూలుకు చెందిన మంత్రి టీజీ భరత్కు 15వ ర్యాంకు లభించింది. నంద్యాలకు చెందిన ఫరూక్కు మొదటి ర్యాంకు, బనగానపల్లెకు చెందిన బీసీ జనార్దన్ రెడ్డి 9వ ర్యాంకు లభించింది.
News February 6, 2025
INDvsENG మ్యాచులో ‘పుష్ప’
నాగ్పూర్లోని విదర్భ స్టేడియం వేదికగా జరుగుతోన్న INDvsENG తొలి వన్డే మ్యాచ్కు భారీగా అభిమానులు తరలివచ్చారు. ఇందులో ఓ వ్యక్తి ‘పుష్ప-2’ సినిమాలో హీరో అల్లు అర్జున్ గంగమ్మ జాతర సాంగ్లో వేసిన గెటప్తో దర్శనమిచ్చాడు. పుష్ప ఫీవర్ నాగ్పూర్ను తాకిందంటూ నెటిజన్లు ఈ ఫొటోను షేర్ చేస్తున్నారు. అయితే, అతనికి ఈ గెటప్ సూట్ కాలేదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అతడెలా ఉన్నాడో కామెంట్ చేయండి.
News February 6, 2025
శ్రీ సత్యసాయి జిల్లా మంత్రులకు సీఎం ర్యాంకులు
సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్లో మంత్రుల పనితీరుపై సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో శ్రీ సత్యసాయి జిల్లా మంత్రులు సత్యకుమార్ యాదవ్ 7, సవిత 11వ ర్యాంకు పొందారు. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సూచించారు.