News August 18, 2024

సీఎంను కలిసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును శనివారం ఢిల్లీలో శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శాఖ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిని కలవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం ముఖ్యమంత్రితో రాష్ట్రానికి సంబంధించి పలు విషయాల పై చర్చించారు.

Similar News

News October 7, 2024

శ్రీకాకుళం: 129 అర్జీలు స్వీకరించిన కలెక్టర్

image

జిల్లా అధికారులు హాజరు తప్పనిసరిగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికను సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అర్జీదారుల నుంచి 129 అర్జీలు స్వీకరించమన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్జీలు పరిష్కారంలో అలసత్వం వహించరాదని సూచించారు. ఎప్పటి అర్జీలు అప్పుడే పరిష్కరించాలని ఆదేశించారు. బాధ్యతగా పనిచేయాలన్నారు.

News October 7, 2024

SKLM: 51 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

image

ప్రజా ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి, చట్ట పరిధిలో త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఎస్పీ మహేశ్వర రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. సకాలంలో బాధితులకు న్యాయం చేయాలని, సంతృప్తి చెందేలా ఫిర్యాదులు పరిష్కరించాలన్నారు. సోమవారం శ్రీకాకుళంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో 51 ఫిర్యాదులు స్వీకరించమని తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వహించరాదన్నారు.

News October 7, 2024

SKLM: జిల్లా పంచాయతీ అధికారిగా పదవీ బాధ్యతలు స్వీకరణ

image

జిల్లా పంచాయతీ అధికారిగా కె. భారతి సౌజన్య సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈమె కాకినాడ డీపీఓ గా పనిచేస్తూ బదిలీపై ఇక్కడకు శ్రీకాకుళం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె ముందుగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను కలుసుకున్నారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌ను కూడా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.