News February 21, 2025
సీఎస్తో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న నెల్లూరు కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వ సేవలను ప్రజలందరూ సంతృప్తి చెందేలా పారదర్శకంగా అందించేందుకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అన్నారు. గురువారం సచివాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్ పాల్గొన్నారు.
Similar News
News February 22, 2025
నెల్లూరు: గ్రూప్-2 పరీక్షలకు 7 పరీక్ష కేంద్రాలు కేటాయింపు

ఈనెల 23న ఆదివారం జరగనున్న గ్రూప్-2 పరీక్షలకు జిల్లాలో ఏడు పరీక్ష కేంద్రాలను కేటాయించినట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఉదయ భాస్కరరావు తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్ -1, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు పేపర్ -11 పరీక్షలు జరుగుతాయన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలు, చిరునామాను తెలుసుకునేందుకు 0861 2331261 కంట్రోల్ రూమ్ నంబర్ ఏర్పాటు చేశామన్నారు.
News February 22, 2025
నెల్లూరు: వెబ్ సైట్లో ఇంటర్ హాల్ టికెట్లు

ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన విద్యార్థుల హాల్ టికెట్లను వెబ్సైట్లో వచ్చినట్లు జిల్లా ఇంటర్ ఆర్ఐవో ఆదూరు శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. https@//bie.ap.gov.in అనే వెబ్సైట్ నుంచి కానీ, విద్యార్థి ఆధార్ కార్డు నంబర్, డేట్ ఆఫ్ బర్త్ మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 నుంచి కూడా హాల్ టికెట్లను విద్యార్థులు పొందవచ్చు అన్నారు.
News February 22, 2025
కావలిలో బాలికను వేధించిన నిందితుడికి జీవిత ఖైదు

బాలికను వేధించిన కేసులో నిందితుడికి జీవితఖైదు, రూ.27వేలు జరిమానా విధిస్తూ నెల్లూరు జిల్లా పోక్సో కోర్టు జడ్జి సిరిపిరెడ్డి సుమ తీర్చునిచ్చారు. కావలిలోని ఓ బట్టల షాపులో పనిచేసే బాలికకు సాయి కిషోర్ అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా కలిశాడు. అనంతరం దారుణంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక కుటుంబసభ్యులు కావలి పోలీసులకు 2017లో ఫిర్యాదు చేశారు. కేసు విచారించి జడ్జి శిక్ష ఖరారు చేశారు.