News March 4, 2025

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: DMHO

image

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని బాపట్ల DMHO డాక్టర్ విజయమ్మ వైద్య సిబ్బందికి సూచించారు. మంగళవారం అద్దంకి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను DMHO సందర్శించారు. వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లతో సమావేశం నిర్వహించి, సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సలహాలు ఇచ్చారు. 

Similar News

News March 5, 2025

ట్రంప్‌తో వాగ్వాదం తీవ్ర విచారకరం: జెలెన్‌స్కీ

image

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వాగ్వాదం తీవ్ర విచారకరమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పశ్చాత్తాపపడ్డారు. ట్రంప్ నాయకత్వంలో పనిచేసేందుకు తాము సిద్ధమని తెలిపారు. ‘రష్యాతో యుద్ధాన్ని ముగించేందుకు మేం సిద్ధం. ఇందుకోసం USతో కలిసి పనిచేసేందుకు మేం ఎదురుచూస్తున్నాం. ఇప్పటివరకు US అందించిన సాయాన్ని ఎంతగానో గౌరవిస్తున్నాం. అగ్రరాజ్యానికి ఉక్రెయిన్ ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది’ అని పేర్కొన్నారు.

News March 5, 2025

మెదక్: ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతులు మృతి

image

మెదక్ జిల్లా నాందేడ్-అకోలా 161 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొడ్మట్ పల్లి- చిల్వర్ మధ్యలో హైవే బ్రిడ్జిపై రాంగ్ రూట్‌లో ఎదురుగా వస్తున్న బైకును కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. అల్లాదుర్గంకు చెందిన బండ సాయిలు (55), మణెమ్మగా గుర్తించారు. బొడ్మట్ పల్లి సంతలో కూరగాయలు అమ్మి ఇంటికి తిరిగి వెళుతుండగా ప్రమాదం జరిగింది.

News March 5, 2025

పెంచికల్పేట్: భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్

image

గత రెండు రోజుల క్రితం మండలం లోడుపల్లి గ్రామంలో వివాహిత అనుమానాస్పద మృతి విషయం తెలిసిందే. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు 24 గంటల్లోనే కేసును ఛేదించినట్లుగా సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఈరోజు ఉదయం 10:30 గంటలకు ఎంకపల్లి బస్టాండ్ వద్ద భర్త గణేశ్, అతని తండ్రిని అదుపులోకి తీసుకొని విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించానని చెప్పినట్లు SI కొమురయ్య తెలిపారు.

error: Content is protected !!