News March 29, 2025
సీతానగరం: వాటర్ ట్యాంకర్ బోల్తా పడి డ్రైవర్ మృతి

బొబ్బిలి మండలం కేశాయివలస సమీపంలో పోడు భూములలో మొక్కలకు నీరు పోస్తుండగా శుక్రవారం ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ఘటనలో సీతానగరం(M) కాశయ్యపేట చెందిన డ్రైవర్ పి.పోలిరాజు(56) అక్కడికక్కడే మృతి చెందారు. పట్టణ సీఐ సతీశ్ కుమార్ సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 2, 2025
నువ్వు దేవుడు సామీ.. వంటమనిషికి రూ.కోటి!

దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా వీలునామా గురించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనకు ఎప్పటి నుంచో వండిపెడుతున్న కుక్ రజన్ షాకు రూ.కోటి ఇచ్చారు. ఇంటి పనులు చేసే సుబ్బయ్యకు రూ.66 లక్షలు, సెక్రటరీ డెల్నాజ్కు రూ.10 లక్షలు ఇవ్వాలన్నారు. తన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ శంతను నాయుడుకు ఉన్న రూ.కోటి రుణాన్ని మాఫీ చేశారు. రతన్ టాటాకు రూ.10వేల కోట్ల ఆస్తులుండగా, రూ.3800 కోట్లను దానధర్మాలకు ఇచ్చేశారు.
News April 2, 2025
రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్

TG: రేషన్ షాపుల్లో సన్నబియ్యం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే సరుకుల కిట్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందిరమ్మ అభయహస్తం పేరుతో ఈ పథకాన్ని అమలు చేయనుందని సమాచారం. గతంలో ‘అమ్మహస్తం’ పేరుతో కేజీ కందిపప్పు, లీటరు పామాయిల్, కిలో గోధుమపిండి, అరకిలో చక్కెర, కిలో ఉప్పు, అరకిలో చింతపండు, కారంపొడి, పసుపు, కిరోసిన్ అందజేసింది.
News April 2, 2025
14వేల ఎకరాల భూమి ఉన్నా ఈ వినాశనం ఎందుకు?: కేటీఆర్

TG: ఫ్యూచర్ సిటీకి భూమి అందుబాటులో ఉన్నా విలువైన పర్యావరణాన్ని వినాశనం చేయడం ఎందుకని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ Xలో ప్రశ్నించారు. ‘ఫ్యూచర్ సిటీ’లో ఐటీ పార్కులు, ఆర్థిక కార్యకలాపాల కోసం 14వేల ఎకరాల భూమి అందుబాటులో ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తు తరాల కోసం ప్రస్తుత నగరాన్ని నాశనం చేస్తారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ జీవ వైవిధ్యాన్ని కాపాడాలని హాష్ట్యాగ్ ఇచ్చారు.