News October 4, 2024

సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా: మంత్రి నారా లోకేశ్

image

తిరుమల లడ్డూ ఘటనపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ మేరకు Xలో ట్వీట్ చేశారు. సత్యం గెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. కాగా ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్‌ ఏర్పాటు చేయాలని శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. సిట్‌లో సీబీఐ నుంచి ఇద్దరు అధికారులు, ఏపీ ప్రభుత్వం నుంచి ఇద్దరు పోలీసు అధికారులు, ఎఫ్‌ఎస్ఎస్‌ఏఐ నుంచి ఒక సీనియర్‌ అధికారి ఉండాలని ధర్మాసనం పేర్కొంది.

Similar News

News October 5, 2024

పట్టభద్రులు ఓటర్లుగా దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్ నాగలక్ష్మి

image

ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి త్వరలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పట్టభద్రులందరూ ఓటర్లగా నమోదు చేసుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి కోరారు. శుక్రవారం, కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణా – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గములో ఓటర్ల నమోదుకు అర్హులైన వారు www.ceoandhra.nic.in వెబ్ సైటు ద్వారా ఫారం- 18 సమర్పించాలన్నారు. నవంబరు 23, 2024 న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తామని చెప్పారు.

News October 4, 2024

గుంటూరు: నేడే వైసీపీ జిల్లా అధ్యక్షుల బాధ్యతల స్వీకరణ

image

వైసీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, గుంటూరు, నర్సరావుపేట లోక్‌సభ నియోజకవర్గాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి శుక్రవారం సాయంత్రం 4 గంటలకు బాధ్యతలు స్వీకరిస్తారని పార్టీ నాయకులు తెలిపారు. స్థానిక శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే పదవీ ప్రమాణస్వీకార సభలో రాజ్యసభ సభ్యులు అయోధ్యరామిరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హాజరు అవుతారని చెప్పారు.

News October 4, 2024

అమరావతి: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే

image

ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం షెడ్యూల్‌ను సీఎం కార్యాలయం విడుదల చేసింది. సీఎం చంద్రబాబు నేడు ఉండవల్లిలోని నివాసంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ఎంఎస్ఎంఈ నూతన పాలసీపై సమీక్ష చేస్తారు. అనంతరం ఆదాయ ఆర్జన శాఖలపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం ధాన్యం సేకరణపై సీఎం సమీక్ష చేస్తారని సీఎం కార్యాలయం తెలియజేసింది.