News March 17, 2025

‘సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట వంట వార్పు’

image

తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ టీచర్లు, వెల్ఫేర్లు 48గంటల పాటు వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈసందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ చెరుకు ఏకలక్ష్మి, అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ జిల్లా కన్వీనర్ బొలిశెట్టి భాస్కరమ్మ, సీటు జిల్లా అధ్యక్షులు ఎం.రాంబాబు, అంగన్వాడీ టీచర్లు, వెల్ఫేర్లు పాల్గొన్నారు.

Similar News

News March 18, 2025

మహబూబాబాద్‌: నిలిచిన పలు రైళ్లు..!

image

సాంకేతిక సమస్య తలెత్తి మహబూబాబాద్ జిల్లా గుండ్రాతిమడుగు రైల్వే స్టేషన్ శివారులో ఓ గూడ్స్ రైలు నిలిచిపోయింది. దీంతో కాజీపేట వైపు వెళ్లే పలు రైళ్లు ఆలస్యంగా వెళ్లాయి. గుండ్రతిమడుగు వద్ద తమిళనాడు ఎక్స్‌ప్రెస్, గార్ల రైల్వే స్టేషన్‌లో ఏపీ ఎక్స్‌ప్రెస్, డోర్నకల్ రైల్వే స్టేషన్‌లో కాకతీయ ప్యాసింజర్ నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

News March 18, 2025

మహబూబాబాద్‌: నిలిచిన పలు రైళ్లు..!

image

సాంకేతిక సమస్య తలెత్తి మహబూబాబాద్ జిల్లా గుండ్రాతిమడుగు రైల్వే స్టేషన్ శివారులో ఓ గూడ్స్ రైలు నిలిచిపోయింది. దీంతో కాజీపేట వైపు వెళ్లే పలు రైళ్లు ఆలస్యంగా వెళ్లాయి. గుండ్రతిమడుగు వద్ద తమిళనాడు ఎక్స్‌ప్రెస్, గార్ల రైల్వే స్టేషన్‌లో ఏపీ ఎక్స్‌ప్రెస్, డోర్నకల్ రైల్వే స్టేషన్‌లో కాకతీయ ప్యాసింజర్ నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

News March 18, 2025

కుబీర్: కరెంట్ షాక్‌తో రైతు మృతి

image

ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన కుబీర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రవీందర్ వివరాల ప్రకారం.. సిర్పెల్లి(H) గ్రామానికి చెందిన పబ్బు గణేశ్(48) సోమవారం వ్యవసాయ భూమిలో మొక్కజొన్నకు నీరు ఇవ్వడానికి వెళ్లాడు. ఇంటికి రాలేదని తన కుమారుడు వెళ్లి చూడగా కరెంట్ షాక్‌కు గురై గణేశ్ విగతజీవిగా పడి ఉన్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI తెలిపారు.

error: Content is protected !!