News February 4, 2025

సూర్యాపేట: కాషాయదళంలో ‘అధ్యక్ష’ దుమారం

image

BJP జిల్లా అధ్యక్షుల ఎన్నికపై దుమారం చెలరేగుతోంది. 3జిల్లాల అధ్యక్ష పదవులకు కీలక నేతలు బరిలో ఉండటంతో బాధ్యతలు ఎవరికివ్వాలనే విషయంలో అధిష్ఠానం డైలమాలో పడింది. యాదాద్రి, SRPT జిల్లాలకు సంబంధించి నాయకుల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ముఖ్యనేతలు సైతం ఏకాభిప్రాయానికి రాలేకపోవడంతో ఎవరికివ్వాలనే విషయంలో సందిగ్ధం కొనసాగుతోంది. నల్గొండ జిల్లాకు వర్షిత్‌రెడ్డి నియామకంపై పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

Similar News

News March 14, 2025

SRD: ఏప్రిల్ 20 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

image

ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 26వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు జరుగుతాయని చెప్పారు. ఓపెన్ స్కూల్ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News March 14, 2025

రొయ్యల హరిప్రసాద్‌కు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు

image

రామాయంపేటకు చెందిన రొయ్యల హరిప్రసాద్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుకు ఎంపికయ్యారు. 1999 సంవత్సరం నుంచి ఉచితంగా తనకు తెలిసిన కరాటే విద్యను అందిస్తూ ఎన్నో అవార్డులు అందుకున్నాడు. హరి ప్రసాద్ సేవలను గుర్తించిన కరాటే ఫెడరేషన్ వారు లైఫ్ టైం అచీవ్మెంట్ బెస్ట్ కరాటే మాస్టర్ అవార్డుకు ఎంపిక చేశారు. ఈనెల 16న హైదరాబాద్లో జరిగే కార్యక్రమంలో హరిప్రసాద్ అవార్డు అందుకోనున్నారు.

News March 14, 2025

15 నుంచి ఒంటిపూట బడులు

image

వేసవి తీవ్రత దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ లోకల్ బాడీ పాఠశాలలకు ఈనెల 15 నుండి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పాఠశాలలు నిర్వహించాలని ఆదేశించింది. జిల్లా విద్యాశాఖ అధికారులు మండల విద్యాశాఖ అధికారుల ద్వారా ఉత్తర్వులను, సమయ సరళిని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పంపిణీ చేయాలని ఆదేశించింది.

error: Content is protected !!