News March 30, 2025
సూర్యాపేట: కేంద్రమంత్రి బండి సంజయ్పై మంత్రి సీతక్క ఫైర్

రాష్ట్రానికి కాంగ్రెస్ కరప్షన్ వైరస్ సోకిందని, రాష్ట్రంలో సన్నబియ్యం కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో హుజూర్ నగర్కు వెళ్తుండగా మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన 12సంవత్సరాల్లో సన్నబియ్యం ఇవ్వాలని ఆలోచన ఎందుకు రాలేదో చెప్పాలన్నారు.
Similar News
News April 2, 2025
సంగారెడ్డి: LRS 25% రాయితీ గడువు పొడిగింపు

సంగారెడ్డి జిల్లాలో ప్లాట్ల లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం 25% రాయితీ గడువును ఈనెల 30 వరకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ వల్లూరి క్రాంతి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ 25% రాయితీ గడువును ప్లాట్ల యజమానులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News April 2, 2025
ఏపీకి నూతన రైల్వే ప్రాజెక్టులు కేటాయించారా?: వేమిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వివరించాలని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి కోరారు. వేమిరెడ్డి ప్రశ్నలకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్టవ్ సమాధానమిచ్చారు. రైల్వే ప్రాజెక్టుల కేటాయింపు రాష్ట్రాలు, జిల్లాల వారీగా ఉండదన్నారు. రైల్వే జోన్ల వారీగా ఉంటుందన్నారు. పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.
News April 2, 2025
సంగారెడ్డి: ‘అంగన్వాడి బాట కార్యక్రమం నిర్వహించాలి’

బడిబాట కార్యక్రమం మాదిరిగా అంగన్వాడి బాట కార్యక్రమాన్ని నిర్వహించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనిత చంద్రన్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతినెల 20న అంగన్వాడి కేంద్రాలను తనిఖీలు చేయాలని చెప్పారు. సమావేశంలో కలెక్టర్ వల్లూరు క్రాంతి, కలెక్టర్ చంద్రశేఖర్, సంక్షేమ శాఖ జిల్లా అధికారి లలితకుమారి పాల్గొన్నారు.