News March 23, 2025
సూర్యాపేట: బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల పరిధిలోని కుంటపల్లి గ్రామ శివారులో ఇవాళ ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి చెందాడు. మృతుడి పేరు యాకుబ్ కాగా అతనిది ఏపీ రాష్ట్రమని స్థానికులు చెబుతున్నారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News March 29, 2025
నోటిఫికేషన్ విడుదల

AP: ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2025 (PGECET) నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. బీటెక్/బీఫార్మసీ పాసైన లేదా చివరి ఏడాది పరీక్షలు రాస్తున్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. 120 మార్కులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది.
News March 29, 2025
ఆర్సీబీ చేతిలో చెన్నై చిత్తు

IPL: సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అన్ని విభాగాల్లో సమష్టిగా రాణించిన బెంగళూరు.. చెన్నైని సునాయాసంగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన RCB 20 ఓవర్లలో 196/7 రన్స్ చేసింది. అనంతరం చెన్నై 146 పరుగులకే పరిమితమైంది. దీంతో ఆర్సీబీ 50 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. రచిన్ ఒక్కడే 41 పరుగులతో రాణించారు. చివర్లో ధోనీ (30*) రెండు సిక్సర్లు కొట్టి అభిమానుల్లో జోష్ నింపారు.
News March 29, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

✓ కొత్తగూడెం ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ ✓ విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో భద్రాచలంలో ఇల్లు దగ్ధం ✓ రాములోరి కళ్యాణానికి చేనేత పట్టు వస్త్రాలు తయారీ ✓ జూలూరుపాడు అంగన్వాడీ కేంద్రానికి తాళం ✓ చంద్రబాబు నా మాటలు వక్రీకరించారు: కూనంనేని ✓ భద్రాచలం: కందిరీగల దాడి.. మృతదేహాన్ని వదిలివెళ్లిన బంధువులు ✓ భద్రాచలం: జవాన్లే లక్ష్యంగా.. 45 కిలోల బాంబ్ బ్లాస్ట్ ప్లాన్.