News April 6, 2024

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మీ మొబైల్ ఫోన్‌లోకి వచ్చే లింకులపై క్లిక్ చేయవద్దని, మీ ప్రమేయం లేకుండా మీ మొబైల్‌కి వచ్చే ఓటీపీలను ఎవరికీ చెప్పొద్దని సూచించారు. ఎవరైనా సైబర్ నేరానికి గురైతే 1930, 100 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు.

Similar News

News April 22, 2025

ఇంటర్ ఫలితాల్లో అల్ఫోర్స్ ప్రభంజనం

image

ఇంటర్మీడియట్ ఫలితాల్లో కరీంనగర్ అల్ఫోర్స్ జూనియర్ కాలేజీ ప్రభంజనం సృష్టించిందని అల్ఫోర్స్ విద్యాసంస్థల ఛైర్మన్ వి.నరేందరెడ్డి తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం MPC విభాగంలో S.లహరి 468, హప్సహస్నాన్ 468, తహూరా నూర్ 468 మార్కులు సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో K.రుత్విక్ 996, శ్రీనిత్యరెడ్డి 995, రుత్విక 995 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో సత్తాచాటారని ఆయన ప్రకటించారు.

News April 22, 2025

ఇల్లందకుంట ఆలయ ఆదాయ వివరాలు

image

ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో 2025 శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల హుండీ లెక్కింపు మంగళవారం ఉదయం 9గంటలకు జరిగింది. ఈ సందర్భంగా రూ.20,69,829 నగదు, 12గ్రా. బంగారం, 305గ్రా. వెండి, 225 డాలర్లు, ఇతర విదేశీ కరెన్సీ లభించాయి. ఈసారి గతేడాదితో పోలిస్తే రూ.2.94 లక్షలు అధికంగా ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

News April 22, 2025

464/470 సాధించిన కేశవపట్నం కస్తూర్బా విద్యార్థిని

image

ఓదెల మండలంలోని గుంపులకు చెందిన పంజాల స్వాతి కేశవపట్నంలోని కస్తూర్బా పాఠశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. పేద కుటుంబానికి చెందిన స్వాతి ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీలో 464/470 మార్కులు సాధించింది. కస్తూర్బా పాఠశాల టాపర్‌గా నిలిచింది. పాఠశాల హెచ్ఎం స్వాతికి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధిస్తానని ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమన్నారు.

error: Content is protected !!