News June 27, 2024

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: వనపర్తి SP

image

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వనపర్తి జిల్లా ఎస్పీ రక్షిత కే మూర్తి అన్నారు. సైబర్ మోసగాళ్ల బారి నుండి ప్రజలు మోసపోకుండా అవగాహన కల్పించే పోస్టర్లను ఆమె గురువారం ఆవిష్కరించారు. ఆన్లైన్ ద్వారా లావాదేవీలు నడిపేవారు కొత్త వ్యక్తులు మాటలు నమ్మకూడదన్నారు. తెలియని మెసేజీలు, క్లిక్ చేయకూడదని అన్నారు. లాటరీ తగిలిందని, లోన్లు వస్తాయంటూ వచ్చే ఫోన్లతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Similar News

News September 20, 2024

రాష్ట్రంలో జిల్లాను ఆదర్శంగా నిలబెట్టాలి: సిక్తా పట్నాయక్

image

విద్యలో జిల్లాను రాష్ట్రానికి ఆదర్శంగా నిలబెట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం నారాయణపేట కేజీబీవీ పాఠశాలలో నోడల్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఎఫ్‌ఎల్‌ఎన్, ఎల్‌ఐపి వంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, వాటిని సక్రమంగా అమలు చేయాలని అన్నారు. ఉత్తీర్ణత శాతం పెంచాలని సూచించారు.

News September 19, 2024

శ్రీశైలం డ్యాం తాజా సమాచారం..

image

శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 880.6 అడుగుల వద్ద 191.2118 టీఎంసీలుగా ఉంది. ఎగువ ఉన్న జూరాల, సుంకేసుల ద్వారా మొత్తంగా జలాశయానికి 21,879 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. భూగర్భ కేంద్రం, ఏపీ జెన్కో పరిధిలో విద్యుత్ ఉత్పత్తికి మొత్తం 67,156 క్యూసెక్కుల నీటిని వినియో గిస్తున్నారు. భూగర్భ కేంద్రంలో 16.879 మిలియన్ యూనిట్లు, కుడిగట్టు కేంద్రంలో 14.697 మి.యూనిట్లు ఉత్పత్తి చేశారు.

News September 19, 2024

జూరాలకు స్వల్ప వరద

image

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో అతి స్వల్పంగా ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రానికి 18, 500 క్యూసెక్కులు మాత్రమే ఉన్నట్లు వివరించారు. విద్యుత్ ఉత్పత్తికి 15,120 క్యూసెక్కుల నీరు వినియోగిస్తున్నారు. మొత్తంగా ప్రాజెక్టు నుంచి 18,385 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 9.583 టీఎంసీల నీరు నిల్వ ఉంది.