News April 28, 2024

సోన్: తండ్రిని చంపిన కేసులో కొడుకు అరెస్ట్

image

తల్లిని చిత్రహింసలకు గురి చేస్తున్న తండ్రిని చంపిన హత్య కేసులో నిందితుడైన కొడుకు సాయిలును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సోన్ సీఐ నవీన్ కుమార్ తెలిపారు. మాదాపూర్ గ్రామానికి చెందిన నడిపి ఎల్లయ్యకు శనివారం రాత్రి భార్య చిన్నక్క అన్నం పెట్టడం ఆలస్యం కావడంతో కర్రతో కొట్టాడు. తల్లిని చిత్రహింసలకు గురిచేయడాన్ని తట్టుకోలేక సాయిలు తండ్రిని కొట్టి చంపాడు.

Similar News

News April 24, 2025

అదిలాబాద్ నుంచి సికింద్రాబాద్‌‌కు గంజాయి రవాణా

image

నిర్మల్‌ ప్రాంతానికి చెందిన ఇద్దరు గంజాయి అమ్ముతూ పట్టుబడ్డారు. పోలీసుల వివరాలిలా.. మలావత్‌ రాజేందర్, ఇండాల్‌ రాథోడ్‌ ఆదిలాబాద్ నుంచి గంజాయి కొనుగోలు చేసి నగరంలో విక్రయిస్తున్నారు. బుధవారం వారిద్దరు కారులో గంజాయి ప్యాకెట్లు తీసుకుని నగరానికి వస్తుండగా బోయిన్‌పల్లి వద్ద ఎక్సైజ్‌ SI శివకృష్ణ వీరిని అదుపులోకి తీసుకున్నారు.

News April 24, 2025

ADB: మూడు రోజుల పాటు RED ALERT

image

ఉమ్మడి ADB జిల్లాలో ఏప్రిల్ చివరి వారంలోనే సుమారు 40 నుంచి 44 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే 3 రోజులపాటు తీవ్ర వడగాలులతో పాటు ఉక్కపోత ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ADB, NRML, MNCL, ASF జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు చేసుకోవాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. మేలో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో జాగ్రత్తగా ఉండండి.

News April 24, 2025

ADB: వడ్డీ వ్యాపారులపై కొరడా జులిపిస్తున్న ఎస్పీ

image

జనాల రక్తాన్ని పిండి పీడిస్తున్న వడ్డీ వ్యాపారులపై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన కొరడా జలపిస్తున్నారు. ఆదిలాబాద్ వన్ టౌన్, టూ టౌన్, మావల, ఇచ్చోడ, బోథ్, ఉట్నూర్ ప్రాంతాలలో ఏకకాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 6 మండలాలలో 30 బృందాలతో ఆకస్మిక దాడులు చేశారు. అధిక వడ్డీ వసూలు చేసే వడ్డీ వ్యాపారులపై జిల్లా వ్యాప్తంగా దాదాపు 20 కేసుల నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!