News March 23, 2024
సోషల్ మీడియా ట్రోలింగ్స్పై నిఘా: ఎస్పీ రాధిక
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఆన్లైన్ వేధింపులు, సోషల్ మీడియా ట్రోలింగ్స్, తప్పుడు వార్తలు ప్రసారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జి.ఆర్ రాధిక హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఆమె ఓ ప్రకటన జారీ చేశారు. అలాంటి వారిపై ప్రత్యేకంగా నిఘా ఉంచామని, అట్టి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Similar News
News October 6, 2024
దసరా ఉత్సవాల కోసం ప్రత్యేక రైళ్లు
దసరా ఉత్సవాల కోసం విజయవాడ(BZA) నుంచి శ్రీకాకుళం రోడ్(CHE) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 6,7,8 తేదీల్లో BZA-CHE(నం.07215) మధ్య, 7,8,9 తేదీల్లో CHE- BZA(నం.07216) మధ్య ఈ రైళ్లు నడుపుతామన్నారు. విజయవాడలో ఈ రైళ్లు పై తేదీల్లో రాత్రి 8 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 5.30 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటాయన్నారు.
News October 6, 2024
అంపైర్గా సిక్కోలు వాసి
విజయవాడలో ఆలిండియా జూనియర్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్ పోటీలు ఈనెల 11వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పోటీలకు అంపైర్గా ఉద్దానం ప్రాంతానికి చెందిన తుంగాన శరత్కు అవకాశం వచ్చింది. ఈ మేరకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ నుంచి శరత్కు ఉత్తర్వులు అందాయి. ఆయనను పలువురు అభినందించారు.
News October 6, 2024
SKLM: నేటి నుంచి IIITకి సెలవులు
ఎచ్చెర్లలోని IIIT క్యాంపస్కు నేటి నుంచి ఈనెల 13వ తేదీ వరకు దసరా సెలవులు ఇచ్చినట్లు డైరెక్టర్ బాలాజీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 14వ తేదీ సోమవారం తరగతులు తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.