News March 9, 2025
స్టీల్ ప్లాంట్లో 900 మంది కార్మికులు తొలగింపు

విశాఖ స్టీల్ప్లాంట్లో 900 మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తొలగించింది. ఇప్పటికే అఖిలపక్ష కార్మిక సంఘాలు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సమ్మె నోటీసులు ఇచ్చారు. అయితే మరో పక్కన స్టీల్ సీఐటీయూ గౌరవాధ్యక్షుడు అయోధ్యరామ్కు యాజమాన్యం షోకాజ్ నోటీసు ఇచ్చింది. ఉక్కు పరిరక్షణ ఉద్యమాన్ని అణగదొక్కేందుకు కార్మిక సంఘాల ప్రతినిధులపై ఉక్కు యాజమాన్యం కుట్రలు చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు.
Similar News
News March 10, 2025
విశాఖలో రౌడీ షీటర్స్కు కౌన్సెలింగ్

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు రౌడీషీటర్లకు సంబంధిత అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా SI సునీత ఆదివారం PMపాలెం పోలీస్ స్టేషన్ ఆవరణలో పలువురు రౌడీ షీటర్స్ను సత్ప్రవర్తనతో వ్యవహరించాలని సూచించారు. ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
News March 9, 2025
విశాఖ: రేపటి నుంచి యథావిధిగా పీజీఆర్ఎస్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) వినతుల స్వీకరణ కార్యక్రమం 10వ తేదీ నుంచి యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. ఎన్నికల కోడ్ కారణంగా గత కొన్ని వారాల నుంచి రద్దైన సంగతి తెలిసిందే. కోడ్ ముగిసిన క్రమంలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని పునఃప్రారంభిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News March 9, 2025
ద్వారకానగర్లో యువతి ఆత్మహత్య

ద్వారకానగర్లో ఓ యువతి ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు ప్రమీల(20) తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఆదివారం ఉదయం రూములో ఉరివేసుకుని చనిపోయింది. యువతి తండ్రి రామినాయుడు ద్వారకానగర్లోని ఓ అపార్ట్మెంట్ సెల్లార్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. వీరి సమాచారం మేరకు ద్వారకానగర్ ఎస్ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. యువతి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.