News May 18, 2024

హత్నూర: నీటి తొట్టెలో పడి 15 నెలల బాలిక మృతి

image

ఇంట్లో ఆడుకుంటూ వెళ్లి ఒక బాలిక నీటి తొట్టెలో పడి మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన రైతు నరేశ్ కుమార్తె హరి చందన (15 నెలలు) గత రాత్రి ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నీటి తొట్టెలో పడి ఊపిరాడక అందులోనే మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News October 5, 2024

మెదక్: ఉమ్మడి జిల్లాకు వర్ష సూచన

image

ఉమ్మడి జిల్లాలోని మెదక్,సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో రెండు రోజులపాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.మెదక్,సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.వాతావరణం మబ్బు పట్టి ఉంటుందని,కొన్నిచోట్ల మోస్తారు వర్షం మరి కొన్నిచోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.

News October 4, 2024

సిద్దిపేటలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

సిద్దిపేట పట్టణం శివాజీ నగర్‌లో ఓ ఇంట్లో వ్యభిచార నడిపిస్తున్నారని సమాచారంతో సిద్దిపేట టాస్క్ ఫోర్స్, వన్ టౌన్ పోలీసుల దాడి చేశారు. ఈ దాడిలో నలుగురి విటులు, ఓ మహిళను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2 వేల నగదు, 6 సెల్ ఫోన్స్, ఓ మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ పోలీసులు తెలిపారు.

News October 4, 2024

MDK: మొదలైన సందడి.. నామినేటెడ్ ఆశలు?

image

మెదక్ జిల్లాలో ప్రస్తుతం గ్రంథాలయ సంస్థ ఛైర్మన్, దేవాదాయ శాఖ, మార్కెట్ కమిటీ, ఆత్మ కమిటీ పాలక మండళ్లు ఖాళీగా ఉన్నాయి. మెదక్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కొండా సురేఖ, మంత్రి దామోదర్ రాజనరసింహ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై ఉమ్మడి మెదక్ జిల్లాలో నామినేటెడ్ పదవులు భర్తీ గురించి చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి సుముఖత వ్యక్తం చేయడంతో జిల్లాలోని ఆశావాహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.