News October 9, 2024

హత్య కేసులో నంద్యాల జిల్లా వ్యక్తికి జీవిత ఖైదు

image

నంద్యాల జిల్లా గోస్పాడు మండలంలోని ఎం.కృష్ణాపురం గ్రామానికి చెందిన బాల ఓబన్నకు తన భార్యను హత్య చేసిన కేసులో ఆళ్లగడ్డ అదనపు జిల్లా జడ్జి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. బాల ఓబన్న గతేడాది భార్య నేసే నాగమ్మను హత్య చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పలు దఫాల విచారణ అనంతరం న్యాయమూర్తి తుది తీర్పును మంగళవారం వెలువరించారు. నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.1000 జరిమానా విధించారు.

Similar News

News October 9, 2024

పల్లెకు మంచి రోజులు

image

గ్రామాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘పల్లె పండుగ’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఈ నెల 14 నుంచి 20 వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. గ్రామ పంచాయతీల్లో అభివృద్ధికి సంబంధించి ఆగస్టు 23న నిర్వహించిన గ్రామ సభలో ప్రతిపాదించిన పనులకు శ్రీకారం చుడతారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.4500 కోట్లు కేటాయిస్తోంది. కాగా కర్నూలు జిల్లాలో 889, నంద్యాల జిల్లాలో 457 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.

News October 9, 2024

కర్నూలు జిల్లాలో ప్రమాదం.. బాలుడి మృతి, ఆరుగురికి గాయాలు

image

కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పెద్దకడబూరు మండలం పులికనుమ వద్ద ఆటోని బొలెరో ఢీకొంది. ఈ ఘటనలో వీరేశ్ (13) అనే బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానికుల సహాయంతో చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ తరలించారు. వీరంతా బసలదొడ్డి గ్రామం నుంచి కూరగాయలు అమ్ముకొని ఆదోని వస్తుండగా ఈ ఘటన జరిగింది. బొలెరో వాహనం అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.

News October 9, 2024

కర్నూలులో రూ.20కోట్లతో ఆహార పరీక్షా ల్యాబ్

image

రాష్ట్రంలో FSSAI ల్యాబులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ప్రతి జిల్లాలోనూ ఆహార పరీక్షల ల్యాబ్ ఏర్పాటు చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరగా FSSAI చీఫ్ ఎగ్జిక్యూటివ్ అఫీసర్ కమలవర్ధనరావు అంగీకరించారు. ఈ ఒప్పందం మేరకు రూ.20 కోట్లతో కర్నూలులోనూ ఇంటిగ్రేటేడ్‌ ఫుడ్‌ ల్యాబ్‌ను నెలకొల్పనున్నారు.