News February 27, 2025
హనుమకొండ జిల్లాలో నేటి టాప్ న్యూస్

✓ HNK: ఆధ్యాత్మిక సమ్మేళన కార్యక్రమానికి హాజరైన మాజీమంత్రి హరీశ్ రావు
✓ MLC ఎన్నికలను విజయవంతం చేద్దాం: CP
✓ HNK: ఎన్నికల పోలింగ్ మెటీరియల్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
✓ బంగారు ఆభరణాలతో జాగ్రత్తగా ఉండాలి: HNK ACP
✓ హైదరాబాదుకు దీటుగా వరంగల్ అభివృద్ధి: MP కడియం కావ్య
✓ పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సెంట్రల్ జోన్ డీసీపీ
Similar News
News February 27, 2025
మహారాష్ట్రలో గోధుమపిండితో బట్టతల!

మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో ఇటీవల 300 మందికి జుట్టు రాలిపోయి చూస్తుండగానే బట్టతల వచ్చింది. దీంతో ప్రముఖ వైద్యుడు హిమ్మత్ రావ్ బవాస్కర్ రీసెర్చ్ చేసి, రొట్టెల తయారీకి వాడుతున్న గోధుమపిండిలో సిలీనియం అధికస్థాయిలో ఉండటమే బట్టతలకు కారణమని తేల్చారు. పంజాబ్, హరియాణాల నుంచి వచ్చిన పిండి బుల్ధానాలో రేషన్ షాపుల ద్వారా పంపిణీ అయింది. ఆ రాష్ట్రాల్లోని పర్వత శ్రేణుల్లో సిలీనియం అధికంగా ఉంటుంది.
News February 27, 2025
ఇంగ్లండ్ను ఓడించిన అఫ్గాన్ వెనుక మాస్టర్ మైండ్ ఈయనే..

CTలో ఇంగ్లండ్కు షాక్ ఇచ్చిన అఫ్గాన్ జట్టు వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జొనాథన్ ట్రాట్ కావడం గమనార్హం. 2022లో ఆయన అఫ్గాన్ హెడ్ కోచ్గా వచ్చారు. ఆయన నేతృత్వంలోని జట్టు 2023 వన్డే WCలో PAK, ENGకు షాక్ ఇచ్చి, SL, నెదర్లాండ్స్ను చిత్తు చేసింది. తర్వాత BANపై తొలిసారి వన్డే సిరీస్ను, PAKపై T20 సిరీస్ను గెలుచుకుంది. ఇప్పుడు CTలోనూ ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.
News February 27, 2025
BREAKING: అస్సాంలో భూకంపం

వరుస భూకంపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 5 మ్యాగ్నిట్యూడ్గా నమోదైంది. తెల్లవారుజామున 2.25 గంటలకు భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. కాగా మంగళవారం కోల్కతా, ఒడిశాలోని భువనేశ్వర్ సమీపంలోని బంగాళాఖాతంలో, బుధవారం ఇండోనేషియాలోని సులవేసి ప్రావిన్స్లో భూకంపం వచ్చింది.