News February 23, 2025

హనుమకొండ: రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్ ప్రావీణ్య

image

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం రద్దు విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు. వచ్చే సోమవారం యథావిధిగా జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

Similar News

News February 24, 2025

దగదగలాడుతున్న కేతకి సంగమేశ్వర ఆలయం

image

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఝరసంగంలోని కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయం విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈనెల 24 నుంచి మార్చి 3వ తేదీ వరకు దేవాలయ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 26న అగ్ని ప్రతిష్ఠ, మహా హోమం, ప్రత్యేక అభిషేకాలు, రాత్రి 12 గంటలకు లింగోద్భవ మహా అభిషేక పూజా కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.

News February 24, 2025

సిర్పూర్ టీ: భీమన్న గుడి వద్ద మృతదేహం

image

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భీమన్న దేవాలయం వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే విషయాన్ని సిర్పూర్ పోలీసులకు అందించారు. అయితే సదరు వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడా లేక హత్య చేశారా అనే విషయం తెలియాల్సి ఉంది.

News February 24, 2025

ఎమ్మెల్సీ ఎన్నికలు.. 3 రోజులు మద్యం అమ్మకాలు బంద్

image

గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా 3 రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. మెదక్, నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు మూసివేయనున్నారు.

error: Content is protected !!