News February 6, 2025
హరీశ్ రావుకు హైకోర్టులో ఊరట
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738809641684_774-normal-WIFI.webp)
గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ క్రమంలో ఈ కేసును కొట్టి వేయాలని హరీశ్ రావు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసుపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. ఈనెల 12 వరకు అరెస్టు చేయొద్దని అధికారులను ఆదేశించింది.
Similar News
News February 6, 2025
పలమనేరు: అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738829244047_51666445-normal-WIFI.webp)
పలమనేరులో అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గంటావూరుకు చెందిన షౌకత్ అల్లి అనే వ్యక్తి ఉదయం ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను లారీ డ్రైవర్గా పనిచేస్తాడు. గత కొంతకాలంగా అప్పువాళ్లు వచ్చి ఇంటిముందు అడుగుతుండడంతో ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబసభ్యులు గమనించి హాస్పిటల్ తీసుకొని వెళ్లేసరికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
News February 6, 2025
వరంగల్: మార్కెట్లో ధరల వివరాలు..
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738830106350_18102126-normal-WIFI.webp)
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం వివిధ రకాల మిర్చి ఉత్పత్తులు రాగా.. ధరలు ఇలా ఉన్నాయి. 5531 మిర్చి రూ.10,500 పలకగా.. అకిరా బ్యాగడి మిర్చి రూ.11వేలు, ఎల్లో మిర్చి రూ.18 వేలు ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. అలాగే 2043 రకం మిర్చి రూ.14 వేలు, 334 మిర్చి రూ.13వేలు ధర వచ్చింది. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
News February 6, 2025
నాగేశ్వరరావు మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి: మాజీ ఎమ్మెల్యే
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738830065043_51758696-normal-WIFI.webp)
కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన కుమ్మరి నాగేశ్వరరావు మరణానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. గురువారం వరంగల్ ఎంజీఎం మార్చురీ వద్ద సుదర్శన్ రెడ్డి మృతుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నాగేశ్వరరావు కుటుంబానికి బీఆర్ఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. ఆయన వెంట ములుగు జిల్లా బీఆర్ఎస్ నాయకులు భూక్యా జంపన్న ఉన్నారు.