News February 13, 2025
హుస్సేన్ సాగర్ స్కైవాక్కు లైన్ క్లియర్
HYDలోని హుస్సేన్సాగర్ చుట్టూ స్కై వాక్కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇప్పటికే HMDA ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (PPP) విధానంలో నిర్మాణం చేపట్టాలని యోచిస్తోంది. హుస్సేన్ సాగర్ చరిత్రను దృష్టిలో పెట్టుకొని నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోనున్నారు. స్కైవాక్తో పాటు సైకిల్ ట్రాక్ను కూడా ఇక్కడ నిర్మించనున్నారు.
Similar News
News February 13, 2025
పెట్టుబడులకు గమ్యస్థానం హైదరాబాద్: మంత్రి
గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ.. HYD విశ్వనగరమని, పెట్టుబడులకు గమ్యస్థానమని అన్నారు. మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ ప్రారంభించడం సంతోషంగా ఉందని, ప్రభుత్వంపై నమ్మకం ఉంచిన మైక్రోసాఫ్ట్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.
News February 13, 2025
గౌలిదొడ్డి: JEEలో గౌలిదొడ్డి విద్యార్థుల ప్రభంజనం
RR జిల్లా గౌలిదొడ్డి గురుకుల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యార్థులు JEE అడ్వాన్స్ పరీక్షలో ప్రభంజనం సృష్టించారు. 99.03 పర్సంటైల్ సాధించి మణిదీప్ అనే విద్యార్థి చరిత్ర సృష్టించాడు. మరోవైపు చరణ్ తేజ్, తేజస్విని, రామ్చరణ్, శ్రీనివాస్, భాను తేజ, నేహాలత, నిహారిక టాప్ ర్యాంకులు సాధించినట్లు రెసిడెన్షియల్ అధికారులు తెలిపారు. ఒకే పాఠశాల నుంచి ఇంత మంది టాప్ ర్యాంకులు సాధించడం గర్వంగా ఉందన్నారు.
News February 13, 2025
HYD: ప్రభాకర్ను ప్రశ్నించనున్న పోలీసులు
గచ్చిబౌలిలోని ప్రీజం పబ్లో బత్తుల ప్రభాకర్ పోలీసులపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. అయితే నిందితుడు ప్రభాకర్ను ప్రశ్నించేందుకు గచ్చిబౌలి పోలీసులు 3మ రోజులు కోర్టు అనుమతి తీసుకున్నారు. కాగా.. ప్రభాకర్ విచారణలో పలు కీలక విషయాలు బయటపడతాయని పోలీసులు చెబుతున్నారు.