News January 31, 2025
హుస్సేన్సాగర్ చుట్టూ స్కైవాక్, సైకిల్ ట్రాక్

దేశ విదేశాలకు చెందిన పర్యాటకులను ఆకట్టుకునేలా హుస్సేన్సాగర్ చుట్టూ స్కైవాక్, సైక్లింగ్, నైట్లైఫ్ షాపింగ్, ఎంటర్టెయిన్మెంట్ వంటి సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండీఏ, హుమ్టా ప్రణాళికలు సిద్ధం చేసింది. హుస్సేన్సాగర్ చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో స్కైవాక్, సైకిల్ ట్రాక్ నిర్మించనుంది. పర్యాటకులు ట్యాంక్బండ్ మీదుగా ఇందిరాపార్కుకు వెళ్లేందుకు అనుగుణంగా దీనిని నిర్మించనున్నారు.
Similar News
News March 14, 2025
HYD: హోలీ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత: సీపీ

35 ఏళ్ల తర్వాత ఒకే రోజు హోలీ, రంజాన్ మాసంలో రెండవ శుక్రవారం ఒకేరోజు రావడంతో HYD సీపీ సీవీ ఆనంద్ అధికారులను అప్రమత్తం చేశారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. ప్రతీ జోన్, సున్నితమైన ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేయాలని, అసాంఘిక శక్తులపై కట్టుదిట్టమైన నిఘా పెట్టాలని అధికారులకు ఆదేశించారు. అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, డీసీపీ చైతన్య కుమార్ పాల్గొన్నారు.
News March 14, 2025
జిల్లాలో కొనసాగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు

రంగారెడ్డి జిల్లాలో ఎండ మండిపోతుంది. గురువారం కొత్తూర్, చందనవెల్లిలో 39.8℃, షాబాద్, మహేశ్వరం, ప్రొద్దుటూరు 39.7, మహంకాళ్, రెడ్డిపల్లె 39.6, చుక్కాపూర్, కేతిరెడ్డిపల్లి 39.5, తాళ్లపల్లి 39.4, మణికొండ 39.3, మొగల్గిద్ద, తోమ్మిడిరేకుల, మంగళ్పల్లి 39.3, పెద్దఅంబర్పేట్, మొయినాబాద్, మామిడిపల్లె, అబ్దుల్లాపూర్మెట్, తట్టిఅన్నారం 39.2, ధర్మసాగర్, ఆరుట్లలో 39.1℃ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
News March 13, 2025
రంగారెడ్డి జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రత

రంగారెడ్డి జిల్లాలో ఎండ తీవ్రత పెరుగుతోంది. బుధవారం మోయినాబాద్లో 39.7℃, మొగల్గిద్ద, కేతిరెడ్డిపల్లె, మంగళపల్లె 39.5, ప్రొద్దుటూరు 39.3, రెడ్డిపల్లె 39.2, షాబాద్, కాసులాబాద్ 39.1, చుక్కాపూర్ 39, మహేశ్వరం, నాగోల్ 38.6, హస్తినాపురం 38.5, మామిడిపల్లె, తుర్కయంజాల్, తొమ్మిదిరేకుల 38.5, కోతూర్, హఫీజ్పేట్ 38.4, చంపాపేట్ 38.3, శంకర్పల్లి 38.3, ఖాజాగూడ, మహంకాళ్, అలకాపురి 38.2℃ ఉష్ణోగ్రత నమోదైంది.