News February 11, 2025
హెలికాప్టర్ ద్వారా భూ సర్వే నిర్వహించిన వరంగల్ కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739235225621_1047-normal-WIFI.webp)
WGL జిల్లాలో హెలికాప్టర్ ద్వారా డిజిటల్ ఏరియల్ భూ సర్వే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రక్రియను KZPT నుంచి కలెక్టర్ సత్య శారద హెలికాప్టర్లో వర్ధన్నపేటకు బయల్దేరి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ‘నక్ష’ ప్రాజెక్టులో భాగంగా వర్ధన్నపేట మున్సిపాలిటీలోని చెరువులు, కాల్వలు తదితర వివరాలతో అక్షాంశాలు, రేఖాంశాలుగా సంబంధిత ప్రాంతాన్ని నమోదు చేస్తారన్నారు. మంగళవారంలోగా సర్వే పూర్తవుతుందని పేర్కొన్నారు.
Similar News
News February 11, 2025
పాఠశాలలకు కోడిగుడ్లు పంపిణీ నిలుపుదల: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739270520245_52165958-normal-WIFI.webp)
బర్డ్ ఫ్లూ తో కోళ్లు మరణిస్తున్న నేపథ్యంలో వారం రోజులు పాఠశాలలకు, అంగన్వాడీలకు కోడిగుడ్లు పంపిణీని నిలిపివేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎమ్మార్వో, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో చర్చించారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, సాంఘిక వసతి గృహాలు, గురుకుల పాఠశాలల పిల్లలకు కోడిగుడ్లు సరఫరా నిలిపివేయాలన్నారు.
News February 11, 2025
ఆధార్ అప్డేట్కు ప్రత్యేక డ్రైవ్లు చేపట్టండి: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739274169674_51728526-normal-WIFI.webp)
ఐదేళ్లకు పైబడిన పాఠశాల విద్యార్థులు, 15 ఏళ్లకు పైబడిన విద్యార్థులు తప్పనిసరిగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్ చేయించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ఇందుకు ప్రత్యేక డ్రైవ్లు చేపట్టాలని ఆయన తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి ఆధార్ పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో ఆధార్ నమోదు స్థితిగతులపై చర్చించారు.
News February 11, 2025
వైసీపీ పంచాయితీరాజ్ విభాగం డైరీ ఆవిష్కరణ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739276164579_20442021-normal-WIFI.webp)
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం వైసీపీ పంచాయితీరాజ్ విభాగం డైరీ 2025ను వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆవిష్కరించారు. గ్రామ స్వరాజ్యం స్ధాపనకు గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, స్ధానిక సంస్ధల బలోపేతంతో పాటు ఆర్ధికంగా వాటిని స్వయంసమృద్ధి దిశగా తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా జగన్ ప్రస్తావించారు. స్థానిక ప్రజాప్రతినిధులకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని వెల్లడించారు.