India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆస్ట్రేలియాతో సూపర్-8 మ్యాచ్లో భారత్ బాల్ ట్యాంపరింగ్ చేసి గెలిచిందని పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఆరోపణలు చేశారు. కొత్త బంతిని అర్ష్దీప్ 16వ ఓవర్లో ఎలా రివర్స్ స్వింగ్ చేయగలిగారని, అంటే బంతి 12 లేదా 13వ ఓవర్లోనే రివర్స్ స్వింగ్కు అనుకూలంగా మారిందా? అని ప్రశ్నించారు. అంపైర్లు కళ్లు తెరిచి ఉండాలని సూచించారు. ఈ మ్యాచ్లో భారత్ 205 రన్స్ చేయగా ఛేదనలో ఆస్ట్రేలియా 181 పరుగులకే పరిమితమై ఓడింది.
రాజస్థాన్లోని దళిత కుటుంబానికి చెందిన మహిళ రాజకీయాల్లోకి రావడమే గ్రేట్. అలాంటిది 26 ఏళ్ల సంజనా జాటవ్ MPగా గెలిచి ఫ్యామిలీతో పార్లమెంట్కు వచ్చారు. తల్లి, అత్తామామల ఆశీర్వాదం తీసుకొని భరత్పూర్ MPగా ప్రమాణం చేశారు. రాజకీయాల్లోకి వచ్చేందుకు అత్తామామలను ఒప్పించానని, MLAగా ఓడిపోయినా కాంగ్రెస్ తనను నమ్మి లోక్సభ టికెట్ ఇచ్చిందని ఆమె తెలిపారు. సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఆమె కుటుంబం ఫొటో వైరలవుతోంది.
రాజమౌళి దంపతులు ఆస్కార్ అకాడమీలో చేరేందుకు ఆహ్వానం అందుకున్నారు. దర్శకుల కేటగిరీలో రాజమౌళి, కాస్ట్యూమ్ కేటగిరీలో రమా రాజమౌళి ఈ అరుదైన ఘనతను దక్కించుకున్నారు. ఈ ఏడాది 57 దేశాల నుంచి 487 మందికి ఆస్కార్ అకాడమీ ఆహ్వానం పంపింది. ఇందులో షబానా అజ్మి, రితేశ్ సిద్వానీ, రవి వర్మన్ మరికొందరు సినీ ప్రముఖులు భారత్ నుంచి ఉన్నారు. గతేడాది రామ్చరణ్, ఎన్టీఆర్, కీరవాణి, సెంథిల్ ఈ అకాడమీలో సభ్యత్వం సంపాదించారు.
ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల కొనుగోళ్లు తగ్గినట్లు ప్రాప్ ఈక్విటీ సంస్థ వెల్లడించింది. JAN-MARతో పోలిస్తే 18% (1,19,901 యూనిట్లు సేల్) తగ్గినట్లు తెలిపింది. గరిష్ఠంగా HYDలో సేల్స్ 36% తగ్గాయని, క్యూ2లో 15,061 యూనిట్లు మాత్రమే విక్రయమైనట్లు తెలిపింది. ఎన్నికల నేపథ్యంలో డెవలపర్లు కొత్త ప్రాజెక్ట్లు లాంచ్ చేయలేదని దీంతో కొనుగోళ్లు నెమ్మదించినట్లు పేర్కొంది.
TG: కాంగ్రెస్ MLC జీవన్రెడ్డి ఢిల్లీకి రావాలని సోనియా గాంధీ ఫోన్ చేశారు. BRS MLA సంజయ్ను పార్టీలో చేర్చుకోవడంతో అలకబూనిన జీవన్రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా నిన్న మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు జీవన్రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను బుజ్జగించారు. ఈరోజు భట్టి ఢిల్లీకి వెళ్లిన కాసేపటికే అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది.
AP: తమ ఊరి పేరు పోలవరం అయితే జగన్మోహనపురం అని పెట్టారంటూ కొందరు యువకులు ఆర్చిపై ఆ పేరును తొలగించారు. కాకినాడ(రూ) మండలం పోలవరంలో ఈ ఘటన జరిగింది. 2020లో కొమరగిరి లేఅవుట్లో ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమానికి అప్పటి CM జగన్ వచ్చారు. దీంతో మార్గమధ్యలోని పోలవరం వద్ద ఆర్చి కట్టి జగన్మోహనపురం అని రాశారు. దీన్ని YCP నేతలు తీయలేదని.. GOVT మారడంతో తొలగిస్తున్నామని యువకులు తెలిపారు. అక్కడ జనసేన జెండా ఎగురవేశారు.
‘కల్కి’ సినిమాకు భారీగా రెస్పాన్స్ వస్తోంది. నార్త్ అమెరికాలో ఆల్ టైమ్ రికార్డ్ ప్రీ బుకింగ్స్ జరిగినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఏకంగా 1.5 లక్షల టికెట్లు అమ్ముడై $4 మిలియన్ల ప్రీసేల్ బిజినెస్ జరిగినట్లు పేర్కొన్నాయి. ఈ సినిమా కలెక్షన్లలో రికార్డులు సృష్టించబోతుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. తొలిరోజు కల్కికి ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లు కలెక్షన్స్ వస్తాయని చెబుతున్నారు.
బీఎస్ఈ సెన్సెక్స్లో ఈనెల మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు భారీ వృద్ధిని నమోదు చేశాయి. మిడ్క్యాప్ ఇప్పటివరకు 7.4% వృద్ధిని నమోదు చేసింది. 2023 NOV తర్వాత ఈ స్థాయి వృద్ధి రావడం ఇదే తొలిసారి. మరోవైపు స్మాల్క్యాప్ సూచీలు 10.2% పెరిగాయి. చివరగా 2021 FEBలో ఈ స్థాయి వృద్ధి రికార్డ్ అయింది. మిడ్క్యాప్, స్మాల్క్యాప్పై ఇన్వెస్టర్లలో పెరుగుతున్న ఆసక్తికి ఇది నిదర్శనమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్పై క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పందించారు. ‘నిశ్శబ్దంగా వీడ్కోలు పలికేందుకు ఎవరూ ఇష్టపడరు. మీ కెరీర్ అత్యద్భుతం. గ్రౌండ్లో బౌండరీలు బాదడం నుంచి బాలీవుడ్ మూవ్స్, డైలాగ్స్ అన్నీ ప్రత్యేకమే. ఫీల్డ్లో, వెలుపల మీరు ట్రూ ఎంటర్టైనర్. మిత్రమా మీతో డ్రెస్సింగ్ రూమ్ని పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సమయాన్ని మీ లవ్లీ ఫ్యామిలీతో గడపండి’ అని ట్వీట్ చేశారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ను సీబీఐ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చింది. ఆయనను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతోంది. ఈ కేసును ప్రత్యేక న్యాయమూర్తి అమితాబ్ రావత్ విచారిస్తున్నారు. ఇదే కోర్టులో వెకేషన్ జడ్జి నియాయ్ బిందు ఇటీవల కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేయగా దానిపై హైకోర్టు స్టే విధించింది. ఇదిలా ఉంటే తిహార్ జైలులో కేజ్రీవాల్ను సీబీఐ నిన్న అరెస్ట్ చేసింది.
Sorry, no posts matched your criteria.