News February 3, 2026

మహిళలూ.. ఈ లక్షణాలున్నాయా? జాగ్రత్త

image

క్యాన్సర్ లక్షణాలు అన్నిసార్లూ బయటకు కనిపించవు. ముఖ్యంగా మహిళల్లో కొన్ని క్యాన్సర్లు నిశ్శబ్ధంగా శరీరంలో వ్యాపిస్తాయంటున్నారు నిపుణులు. చాలా క్యాన్సర్లను ప్రారంభదశలో గుర్తించడం కష్టమని చెబుతున్నారు. అందుకే మహిళల్లో అసాధారణ వాపు, దీర్ఘకాల అలసట, కారణం లేకుండా బరువు తగ్గడం, చర్మంపై మార్పులు, అసాధారణ రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

News February 3, 2026

గతేడాది 19 విమాన ప్రమాదాలు

image

గతేడాది దేశంలో 19 విమాన ప్రమాదాలు జరిగినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఈ ఘటనలపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) దర్యాప్తు చేసిందని వెల్లడించారు. వీటికి సంబంధించిన నివేదికలను AAIB వెబ్‌సైట్‌లో ప్రచురించామని ఆయన తెలిపారు.

News February 3, 2026

ఎల్‌ఐసీ FPOకి రంగం సిద్ధం

image

వచ్చే FYలో LICలో మలి విడత పబ్లిక్‌ ఆఫరింగ్‌ (FPO)కు కేంద్రం సిద్ధమవుతోంది. సెబీ నిబంధనల ప్రకారం 2027 నాటికి పబ్లిక్‌ వాటాను 10%కి పెంచాల్సి ఉంది. దీంతో ప్రస్తుతం ఉన్న 96.5% ప్రభుత్వ వాటాలో మరో 6.5% తగ్గించనుంది. మార్కెట్‌ పరిస్థితులు అనుకూలిస్తేనే దీనికి అడుగులు పడతాయని ఆర్థిక సేవల శాఖ తెలిపింది. 2022లో IPOతో రూ.21,000 కోట్లు సమకూరాయి. ప్రస్తుతం సంస్థ మార్కెట్‌ విలువ రూ.5.08 లక్షల కోట్లుగా ఉంది.

News February 3, 2026

అంబటి, జోగి కుటుంబాలను పరామర్శించనున్న జగన్

image

AP: మాజీ CM, YCP అధ్యక్షుడు జగన్ రేపు గుంటూరులో పర్యటించనున్నారు. CM చంద్రబాబుపై అనుచిత వాఖ్యల కేసులో అరెస్టైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శిస్తారు. అలాగే శుక్రవారం ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేశ్ సహా ఆయన కుటుంబాన్ని జగన్ కలవనున్నారు. TDP శ్రేణుల దాడిలో దెబ్బతిన్న రమేశ్ ఇంటిని పరిశీలిస్తారు. ఈ మేరకు YCP MLC తలశిల రఘురామ్ ఒక ప్రకటన విడుదల చేశారు.

News February 3, 2026

వ్యవసాయంలో అధిక ఆదాయం ఇలా సాధ్యం

image

సాగులో సమీకృత వ్యవసాయంతో అధిక ఆదాయం సాధ్యమంటున్నారు నిపుణులు. భూమిని భాగాలుగా విభజించి వరి, చిరు ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను సాగు చేస్తూనే.. కోళ్లు, గొర్రెలు, మేకలు, పాడి పశువులు, చేపల పెంపకాన్ని చేపట్టడాన్నే సమీకృత వ్యవసాయం అంటారు. దీని వల్ల కొద్దిపాటి భూమిలోనే ఏడాది పొడవునా రైతులు ఆదాయం పొందవచ్చు. దీన్ని ఎలా చేయాలి? ఏ భూములకు అనుకూలమో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.

News February 3, 2026

నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు

image

TG: మున్సి పల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాపై సాయంత్రం క్లారిటీ రానుంది. రెబల్స్‌ను బుజ్జగించే పనిలో 3 పార్టీల (కాంగ్రెస్, BRS, BJP) అగ్రనేతలు నిమగ్నమయ్యారని సమాచారం. పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ మంత్రులతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు.

News February 3, 2026

ఆయుష్ మంత్రిత్వశాఖలో యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు

image

<>ఆయుష్ <<>>మంత్రిత్వశాఖ 6 యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 8 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BTech/MBA, PG/M.Phil/PhD, MD అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి అభ్యర్థుల గరిష్ఠ వయసు 32 ఏళ్లు. జీతం నెలకు రూ.40వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://ayush.gov.in

News February 3, 2026

ఒకే దేవుడికి చెందిన విగ్రహం ఒకటి కంటే ఎక్కువ ఉండకూడదా?

image

అలా ఉన్నా ఏ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే విగ్రహాల సంఖ్య కంటే భక్తే ముఖ్యం. అయితే వాటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. దీపారాధన చేస్తూ ఉండాలని ఆధ్యాత్మికవేత్తలు సూచిస్తున్నారు. ఒకవేళ అదనంగా విగ్రహాలను ఉంచడం ఇష్టం లేకపోతే వాటిని దేవాలయాలకు దానం చేయవచ్చు. శుభ్రమైన వస్త్రంలో చుట్టి భద్రపరచవచ్చు. అయితే విరిగిన/పాడైన విగ్రహాలను ఇంట్లో ఉంచడం మంచిది కాదు. పవిత్రమైన చెట్ల కింద లేదా దేవాలయాల వద్ద ఉంచడం శ్రేయస్కరం.

News February 3, 2026

అంబటి ఇంటిపై దాడి ఘటన.. TDP నేతలపై కేసు నమోదు

image

AP: వైసీపీ నేత అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడి ఘటనలో TDP నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంబటి ఫిర్యాదు మేరకు గుంటూరు పట్టాభిపురం PSలో టీడీపీ కార్పొరేటర్‌ ఇసుక బుజ్జి సహా పలువురిపై కేసు పెట్టారు. ఇంటిపై దాడి చేసి ఆస్తి ధ్వంసం, అక్రమ నిర్బంధం, బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అంబటిని కస్టడీకి ఇవ్వాలని నల్లపాడు పోలీసులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

News February 3, 2026

APSRTC కోసం 2,500 కొత్త బస్సులు

image

AP: ఈ ఏడాది చివరి నాటికి 2,500 ఎలక్ట్రిక్/CNG బస్సులను కొనుగోలు చేస్తామని RTC ఇన్‌ఛార్జ్ MD కృష్ణబాబు తెలిపారు. PM ఈ-బస్ పథకం కింద 1050 విద్యుత్ బస్సులు రానున్నాయని, అదనంగా మరో 1450 ఎలక్ట్రిక్, CNG బస్సులను ప్రవేశపెట్టడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. RTCలో డ్రైవర్లతో పాటుగా ఇతర నియామకాలను చేపడతామని, ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు EHSను మరింత మెరుగుపరుస్తామని చెప్పారు.