News September 2, 2025

అవినీతి సొమ్ము పంచుకోవడంలో విభేదాలు: రాంచందర్ రావు

image

TG: ‘కాళేశ్వరం’లో అవినీతి జరిగిందని కవిత వ్యాఖ్యలతో స్పష్టమైందని బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు అన్నారు. అవినీతి సొమ్ము పంపకాల్లో తేడాల వల్లే కుటుంబంలో విభేదాలు వచ్చాయని ఆరోపించారు. కాళేశ్వరం అవినీతిని డైవర్షన్ చేసేందుకు కవితను సస్పెండ్ చేశారని ఎంపీ డీకే అరుణ అన్నారు. కల్వకుంట్ల కుటుంబంలో అధికారంకోసం పంచాయితీ జరుగుతోందన్నారు. BRS, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు.

News September 2, 2025

అందుబాటులోకి హైడ్రా టోల్‌ఫ్రీ నంబర్

image

ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ ‘1070’ను అందుబాటులో తీసుకొచ్చినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూములు కబ్జాకు గురైతే వెంటనే ఈ నంబర్‌కు సమాచారాన్ని అందించవచ్చని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు, చెట్లు నేలకూలడం, వరదలు, అగ్ని ప్రమాదాలు జరిగినా హైడ్రా సేవల కోసం సంప్రదించవచ్చని పేర్కొన్నారు. దీంతో పాటు మరో 3 నంబర్లు అందుబాటులో ఉంటాయన్నారు.

News September 2, 2025

మారిటైమ్ స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో సీఎం భేటీ

image

AP: విశాఖపట్నంలో ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మారీటైమ్ రంగంలోని బ్లర్గ్స్ ఏఐ, డాకర్ విజన్, ఓల్టియో మారిటైమ్, ఆటోమాక్సిస్, ఈజీ లేన్, ఎయిమ్ లొకేట్ తదితర స్టార్టప్ సంస్థల ప్రతినిధులతో ఆయన చర్చలు జరిపారు. పలు కంపెనీల సీీఈవోలతోనూ ఆయన భేటీ అయ్యారు. ఏపీని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.

News September 2, 2025

కవిత సస్పెన్షన్ సరికాదు: జాగృతి నేతలు

image

TG: BRS నుంచి కవితను సస్పెండ్ చేయడాన్ని ఆమె అభిమానులు, జాగృతి నేతలు తప్పుబట్టారు. కవిత వ్యాఖ్యలపై వివరణ తీసుకోకుండా, షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. సస్పెన్షన్ వ్యవహారం ఏకపక్షంగా ఉందని మండిపడ్డారు. ఆమెకు మద్దతు తెలియజేసేందుకు HYDలోని జాగృతి కార్యాలయానికి వారు చేరుకుంటున్నారు. హరీశ్ రావు, జగదీశ్ రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు.

News September 2, 2025

మహిళల సూపర్ ఫుడ్ ‘శనగలు’

image

శనగలను ఉడికించి/వేయించుకుని తింటే మహిళల ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయి. వీటిలోని ఇనుము, ఫోలేట్ రక్తంలోని హీమోగ్లోబిన్ స్థాయిని పెంచి ఎనీమియాను తగ్గిస్తాయి. కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌లు ఎముకల సత్తువను పెంచుతాయి. శనగల్లోని ఫైటోఈస్ట్రోజన్స్ హార్మోన్ లెవెన్స్‌ను క్రమబద్ధీకరిస్తాయి. గర్భిణులు వీటిని తినడం వల్ల ఫోలిక్ యాసిడ్ తగినంత ఉత్పత్తయి శిశువు మెదడు, వెన్నెముక అభివృద్ధికి దోహదం చేస్తుంది.

News September 2, 2025

మందారతో ముఖానికి మెరుపు

image

చర్మ సౌందర్యాన్ని పెంచడంలో మందార పువ్వులు ప్రధానపాత్ర పోషిస్తాయి. వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు ముఖాన్ని మెరిపిస్తాయి. తాజా మందార పూలను తీసుకుని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఒక పాత్రలో టేబుల్ స్పూన్ మందార పొడి, తేనె, పాలు వేసి మిశ్రమం కలుపుకోవాలి. దాన్ని చర్మానికి అప్లై చేసి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికొకసారి చేస్తే ముఖం వికసిస్తుంది.

News September 2, 2025

విధేయుడి వైపే నిలబడ్డ గులాబీ బాస్!

image

TG: కవిత వర్సెస్ హరీశ్ ఎపిసోడ్‌లో గులాబీ బాస్ KCR.. హరీశ్ వైపే నిలబడ్డారు. ఆరోపణలు చేసి 24 గంటలు గడవకముందే కవితను సస్పెండ్ చేశారు. కన్న కూతురైనా పార్టీ తర్వాతే అనే స్పష్టమైన సంకేతాలు కేడర్‌కు పంపారు. పార్టీకి హరీశ్ వెన్నుపోటు పొడుస్తారని గతంలో ఎన్నోసార్లు ప్రచారం జరిగింది. కానీ అవేమీ లెక్కచేయని ఆయన.. కేసీఆరే తన అధినేత అని కుండబద్దలు కొట్టారు. అదే విధేయత ఇప్పుడు అధినేత తనవైపు నిలబడేలా చేసింది.

News September 2, 2025

పంట నష్టంపై 5 రోజుల్లో నివేదిక ఇవ్వాలి: మంత్రి తుమ్మల

image

TG: వర్షాలు, వరదలతో నష్టపోయిన పంట వివరాలపై 5 రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. అటు నిన్న ఒక్కరోజే 9వేల మెట్రిక్ టన్నుల(MT) యూరియా రాష్ట్రానికి వచ్చిందని తెలిపారు. ఇవాళ మరో 5వేల MTలు, వారం రోజుల్లో 27,470 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని చెప్పారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా డిమాండ్‌కు తగ్గట్లుగా యూరియా పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

News September 2, 2025

కవిత కల్లోలాన్ని వివరిస్తున్న వేమన పద్యం

image

చెప్పులోని రాయి చెవిలోని జోరీగ
కంటిలోని నలుసు కాలి ముల్లు
ఇంటిలోని పోరు ఇంతింతగాదయా
విశ్వదాభిరామ వినురవేమ
—–
భావం: చెప్పులో రాయి ఉంటే నడకలో, చెవి చుట్టూ ఈగ శబ్దం చేస్తుంటే ఇబ్బందులు తప్పదు. కంట్లో నలుసు, కాలి ముల్లు మనకు గుచ్చుతూనే ఉంటాయి. అలాగే ప్రపంచంలో ఎంత పెద్ద సమస్య ఉన్నా మన ఇంట్లో పోరుతో మనకు బాధ ఎక్కువ.

News September 2, 2025

మరోసారి బోయపాటితో అల్లు అర్జున్ సినిమా?

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత బోయపాటి శ్రీనుతో ‘సరైనోడు-2’ సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు అల్లు అరవింద్ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. బాలకృష్ణతో బోయపాటి తీస్తున్న ‘అఖండ-2’ హిట్ అయితే బన్నీ-బోయపాటి ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ పడుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.