News October 23, 2024
అంబాజీపేట: కన్నీరు పెట్టిస్తున్న దంపతుల సూసైడ్ నోట్

అంబాజీపేటకు చెందిన రామసుబ్రహ్మణ్యం, నాగమణి దంపతుల సూసైడ్ నోట్ కన్నీరు తెప్పిస్తోంది. ‘ఇంతవరకు మాకు చేసిన సేవలు చాలు, మీరైనా సుఖపడండి’అని లేఖలో పేర్కొన్నారు. పదేళ్ల క్రితం కొడుకు వెంకటకిరణ్, కోడలు లక్ష్మీశ్వేత, మనవరాలు, మనవడు రాజమండ్రిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన వీరిని మనోవేదనకు గురిచేసింది. ప్రస్తుతం వీరి వద్ద చిన్న కుమార్తె సునీత తన బిడ్డతో ఉండగా.. ఆమె విశాఖలో ఓ వేడుకకు వెళ్లిన సమయంలో ఘటన జరిగింది.
Similar News
News January 4, 2026
RJY: ఇల్లు లేని వారికి గుడ్ న్యూస్

తూర్పుగోదావరి జిల్లాలో ‘ఆవాస్ ప్లస్’ హౌసింగ్ సర్వే పూర్తయినట్లు అధికారులు ఆదివారం వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 23,676 మంది లబ్ధిదారులను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. సొంత స్థలం ఉన్నవారు, లేనివారితో పాటు గతంలో ఇళ్లు అసంపూర్తిగా నిలిచిన వారి వివరాలను సేకరించారు. రాజానగరం, రాజమహేంద్రవరం రూరల్, దేవరపల్లి సహా పలు మండలాల్లో ఈ లబ్ధిదారులు ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.
News January 4, 2026
9న రాజమండ్రిలో మెగా జాబ్ మేళా

రాజమండ్రి మంజీర కన్వెన్షన్స్లో జనవరి 9న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు మాజీ MP మార్గాని భరత్ శనివారం ప్రకటించారు. సుమారు 70 ప్రముఖ కంపెనీలు పాల్గొనే ఈ మేళా ద్వారా 3,000 ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. ప్రైవేటు రంగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News January 4, 2026
9న రాజమండ్రిలో మెగా జాబ్ మేళా

రాజమండ్రి మంజీర కన్వెన్షన్స్లో జనవరి 9న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు మాజీ MP మార్గాని భరత్ శనివారం ప్రకటించారు. సుమారు 70 ప్రముఖ కంపెనీలు పాల్గొనే ఈ మేళా ద్వారా 3,000 ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. ప్రైవేటు రంగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.


