News February 14, 2025
అన్నవరం దేవస్థానం కాంట్రాక్టర్కు జరిమానా

కాకినాడకు చెందిన న్యాయవాది లక్ష్మీనారాయణ అన్నవరం దర్శనానికి వెళ్లారు. ఆయన సెల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్లో ఉంచారు. దర్శనం తర్వాత ఫోను కోసం వెళ్లగా రూ.10 చెల్లించాలన్నారు. రూ.5 అదనంగా వసూలు చేస్తున్నారని ఆయన నిలదీశారు. దీనిపై ఆయన DEC 4న వినియోగదారుల ఫోరంలో కేసు వేశారు. విచారణ చేపట్టిన కోర్టు రూ.15 వేలు ఫిర్యాదుదారునికి, రూ.5 లక్షలు దేవస్థానంకు చెల్లించాలని కాంట్రాక్టర్ను ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది.
Similar News
News September 13, 2025
పార్వతీపురం: గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పిస్తాం

గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించడానికి కృషి చేస్తామని జిల్లా ప్రజా రవాణాధికారి పి.వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ప్రజా రవాణాధికారి కార్యాలయంలో నిర్వహించిన డయల్ యువర్ ప్రజా రవాణాధికారి కార్యక్రమానికి 26 వినతులు వచ్చాయి. ఉన్నతాధికారులను సంప్రదించి సాధ్యమైనంత వరకూ పల్లెలకు, చివరి గ్రామాలకు బస్సు సౌకర్యం, స్టాపుల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
News September 13, 2025
భారత్పై సుంకాలు విధించాలని G7, EUకి US రిక్వెస్ట్!

రష్యా నుంచి ఆయిల్ కొంటున్న భారత్, చైనాపై సుంకాలు విధించాలని G7 దేశాలు, EUను US కోరినట్లు రాయిటర్స్ తెలిపింది. G7 ఫైనాన్స్ మినిస్టర్ల మధ్య జరిగిన ఫోన్ కాల్లో దీనిపై చర్చ జరిగినట్లు పేర్కొంది. ఉక్రెయిన్తో యుద్ధాన్ని ముగించేలా రష్యాపై ఒత్తిడి తేవాలని వారు చర్చించినట్లు తెలిపింది. ఫ్రీజ్ చేసిన రష్యా అసెట్స్ను వినియోగించుకుని, ఉక్రెయిన్ రక్షణకు నిధులు సమకూర్చేందుకూ అంగీకరించారని వెల్లడించింది.
News September 13, 2025
రూ. 2,000 కోట్లతో నౌకాదళ ఆయుధగారం ప్రాజెక్టు: MP పుట్టా

జీలుగుమిల్లిలో రూ.2,000 కోట్ల నౌకాదళ ఆయుధగారం ప్రాజెక్టు వస్తోందని ఏలూరు MP పుట్టా మహేశ్ కుమార్ అన్నారు. నేవీ అధికారులతో ఏలూరు కలెక్టరేట్లో శుక్రవారం ఎంపీ సమావేశమయ్యారు. ప్రాజెక్టు కోసం 1,116 ఎకరాల భూమి గుర్తించారన్నారు. భూసేకరణ పూర్తయితే పనులు మొదలవుతాయన్నారు. వచ్చే 10 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తవుతుందని, దీనివల్ల అనేక మందికి ఉపాధి లభిస్తుందని ఎంపీ తెలిపారు.