News October 17, 2024

ఇసుక రీచ్ సీల్డ్ టెండర్లకు రేపే చివరి అవకాశం

image

శ్రీకాకుళం జిల్లాలో మరో 6 రీచ్‌ల నిర్వహణ హక్కులకు సీల్డ్ టెండర్లు కోరుతున్నట్టు మైన్స్ శాఖ DD మోహనరావు తెలిపారు. పురుషోత్తపురం-1, పురుషోత్తమపురం-2 (సరుబుజ్జిలి), ముద్దాడపేట (ఎచ్చెర్ల), కిల్లిపాలెం(శ్రీకాకుళం), ముద్దాడపేట(అమదాలవలస), పర్లాం(నరసన్నపేట) రీచ్‌ల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 18న ఉదయం11 గంటల లోపు టెండర్లు దాఖలు చేయాలన్నారు.

Similar News

News October 27, 2025

ప్రాణ నష్టం 0 లక్ష్యంగా అధికారులు పనిచేయాలి: స్పెషల్ ఆఫీసర్

image

ప్రాణ నష్టం 0 లక్ష్యంగా పనిచేయాలని, అత్యవసర పరిస్థితుల్లో గోల్డెన్ అవర్‌ను ఏ అధికారి వృథా చేయకుండా పనిచేయాలని శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక అధికారి KVN చక్రధరబాబు అధికారులను ఆదేశించారు. ఆదివారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో ఎస్పీ, ఇన్‌ఛార్జ్ కలెక్టర్, అధికారులతో సమావేశం నిర్వహించారు. మెంథా తుపాను ఈనెల 28న తీరం దాటే అవకాశం ఉందన్నారు. ప్రతి అధికారి ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.

News October 27, 2025

SKLM: నేడు ప్రజా ఫిర్యాదులు, నమోదు కార్యక్రమం రద్దు

image

ఈనెల 27న శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో జరగనున్న ప్రజా ఫిర్యాదులు నమోదు, పరిష్కార వేదిక రద్దు చేస్తున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ అహమ్మద్ ఫర్మాన్ ఖాన్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేస్తారు. మోంథా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలోని అధికారులు పర్యవేక్షణలో ఉంటారని ఆయన తెలియజేశారు. మండలాల్లో సైతం నిర్వహించనున్న గ్రీవెన్స్ కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు.

News October 26, 2025

శ్రీకాకుళం: విద్యా సంస్థలకు 3 రోజులు సెలవులు

image

జిల్లాలోని విద్యాసంస్థలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించినట్లు జేసీ ఫర్మన్ అహ్మద్ ఖాన్ ఆదివారం తెలిపారు. తుపాన్ కారణంగా ఈనెల 27, 28, 29 తేదీల్లో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించామన్నారు. మూడు రోజుల పాటు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యార్థులు బయట తిరగొద్దని సూచించారు.