News October 17, 2024

ఇసుక రీచ్ సీల్డ్ టెండర్లకు రేపే చివరి అవకాశం

image

శ్రీకాకుళం జిల్లాలో మరో 6 రీచ్‌ల నిర్వహణ హక్కులకు సీల్డ్ టెండర్లు కోరుతున్నట్టు మైన్స్ శాఖ DD మోహనరావు తెలిపారు. పురుషోత్తపురం-1, పురుషోత్తమపురం-2 (సరుబుజ్జిలి), ముద్దాడపేట (ఎచ్చెర్ల), కిల్లిపాలెం(శ్రీకాకుళం), ముద్దాడపేట(అమదాలవలస), పర్లాం(నరసన్నపేట) రీచ్‌ల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 18న ఉదయం11 గంటల లోపు టెండర్లు దాఖలు చేయాలన్నారు.

Similar News

News October 17, 2024

శ్రీకాకుళం: అలాంటి వారిపై చర్యలు తీసుకోండి 

image

శ్రీకాకుళం జిల్లాలో 11 బాలల సంరక్షణ కేంద్రాలు రిజిస్ట్రేషన్ చేసుకోగా 13 బాలల సంరక్షణ కేంద్రాలు రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తున్నాయని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. గురువారం ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడారు. రిజిస్ట్రేషన్ లేకుండా బాలల సంరక్షణ కేంద్రాలు నిర్వహించే కేంద్రాలపై కేసు నమోదు చేయాలన్నారు. అనుమతులు లేని బాలల సంరక్షణ కేంద్రాలను తక్షణమే మూయించాలని ఆదేశించారు.

News October 17, 2024

SKLM: ఈ నెల 18న విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్

image

ఈ నెల అక్టోబర్ 18న విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్ కార్యక్రమం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతుందని విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు కె.కవిత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఫిర్యాదుదారుల నుంచి వినతుల స్వీకరణ ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News October 17, 2024

ఆదిత్యుని సేవలో తనికెళ్ల భరణి

image

ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవిల్లి శ్రీసూర్యనారాయణ స్వామివారిని సినీ రచయిత, నటుడు తనికెళ్ల భరణి గురువారం దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదపండితులు ఆశీర్వదించారు. ఆయనకు స్వామివారి జ్ఞాపిక, ప్రసాదాలు అందజేశారు. ఆలయ డీసీ వై.భాద్రజీ పాల్గొన్నారు.