News November 27, 2024

ఎచ్చెర్ల: పీజీ కోర్సులో ఈనెల 29న స్పాట్ అడ్మిషన్

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మిగులు సీట్లకు ఈ నెల 29న స్పాట్ అడ్మిషన్ నిర్వహించినట్లు రిజిస్ట్రార్ పి.సుజాత బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉన్నత విద్యా మండలి ఆదేశాల మేరకు ఉదయం.10 నుంచి మధ్యాహ్నం మూడు వరకు ఈ ప్రవేశాలు జరగనున్నాయని తెలిపారు. ఏపీ పీజీ సెట్ -2024 అర్హతతో సంబంధం లేకుండా డిగ్రీ ఉత్తీర్ణత ఆధారంగా ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. 

Similar News

News January 8, 2026

ట్రాఫిక్ సమస్య రానీయకూడదు: ఎస్పీ మహేశ్వర్ రెడ్డి

image

రథసప్తమి వేడుకలు నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య రానీయకూడదని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం పరిసరాలను పరిశీలించారు. 80 అడుగుల రహదారిలో మిల్లు జంక్షన్ వద్ద వాహనాలు పార్కింగ్ చేసే స్థలాలను గుర్తించారు. భక్తులకు దర్శనాలకు రాకపోకలకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని సిబ్బందికి సూచించారు. రద్దీ నియంత్రణకు తగు జాగ్రత్తలు వహించాలన్నారు.

News January 8, 2026

SKLM: నలుగురు ఉద్యోగులకు పదోన్నతి పత్రాలు అందజేసిన చైర్‌పర్సన్

image

జిల్లా పరిషత్ పరిధిలోని వివిధ కార్యాలయాలు, ఉన్నత పాఠశాలల్లో ఆఫీస్ సబార్డినేట్లుగా పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులకు రికార్డు సహాయకులుగా పదోన్నతి కల్పిస్తూ జడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ గురువారం నియామక పత్రాలు అందజేశారు. తన అధికారిక నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్.జ్యోతికుమారి (అమలపాడు), కె.పావని (బ్రాహ్మణతర్ల), హెచ్. శాంతిలక్ష్మి (బోరుభద్ర) కే ప్రసాదరావు (గొప్పిలి) పదోన్నతి పొందారు.

News January 8, 2026

SKLM: అంగన్వాడీలో చిన్నారులకు కొత్త మెనూ

image

అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందిస్తున్న మెనూలో స్వల్పమార్పులు జరిగాయి. కేంద్రాల్లో చిన్నారులకు మంగళ, శనివారాలు ఉదయం ఉడకబెట్టిన శనగలు, మధ్యాహ్నం ఎగ్ ఫ్రైడ్‌రైస్ పెట్టాలని ఐసీడీఎస్ ఉన్నతాధికారులు ఆదేశించారు. మిగిలిన రోజుల్లో యథావిధిగా అన్నం, ఆకుకూరలు, పప్పు, కూరగాయలు, పాలును అమలు చేయాలని పేర్కొన్నారు. జిల్లాలోని 16 ప్రాజెక్టుల్లోని 3,562 కేంద్రాల్లో కొత్త మెనూ అమలులోకి వచ్చింది.