News February 10, 2025
గొండుపాలెం: డీసీసీబీ మాజీ డైరెక్టర్ మృతి

కే కోటపాడు పీఏసీఎస్ మాజీ అధ్యక్షులు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ బండారు వెంకన్న పాత్రుడు స్వగ్రామం అయిన గొండుపాలెంలో ఆదివారం ఆకస్మికంగా మరణించారు. పలువురు ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు తీవ్ర సానుభూతి తెలిపారు. పీఏసీఎస్ అధ్యక్షుడిగా, డీసీసీబీ డైరెక్టర్గా ఆయన రైతుల సంక్షేమానికి కృషి చేశారని పలువురు తెలిపారు.
Similar News
News December 8, 2025
నాగర్కర్నూల్: 154 టీచర్, 974 ఆయా పోస్టులు ఖాళీలు

నాగర్ కర్నూల్ జిల్లాలో 154 అంగన్వాడీ టీచర్లు, 974 ఆయా పోస్టులు ఖాళీలు ఉన్నాయి. పోస్టులు భర్తీ చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించినట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి రాజేశ్వరి సోమవారం తెలిపారు. ఖాళీ పోస్టుల కారణంగా గ్రామాలలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ కష్టంగా మారిందన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు.
News December 8, 2025
ఇండిగో సంక్షోభం.. అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో

ఇండిగో విమానాల సంక్షోభంపై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రభుత్వం ఇప్పటికే దీనిపై చర్యలు తీసుకుంటోందని తెలిపింది. ఈ సమయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అయితే ఇది తీవ్రమైన సమస్య అని, లక్షలాది మంది బాధితులు ఉన్నారని ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా విమానాల రద్దుపై ఈ పిల్ దాఖలైంది.
News December 8, 2025
జగిత్యాల జిల్లాలో చలి తీవ్రత

జగిత్యాల జిల్లాలో చలి తీవ్రత భారీగా పెరిగింది. కథలాపూర్లో 9.9℃, మన్నెగూడెం 10℃, గుల్లకోటలో 10℃ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వాతావరణ కేంద్రం ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాఘవపేట 10.1, మల్లాపూర్, నేరెళ్ల 10.2, గోవిందారం 10.3, ఐలాపూర్ 10.4, సారంగాపూర్, రాయికల్, మేడిపల్లి 10.5, జగ్గసాగర్ 10.6, పెగడపల్లి, పొలాస, పూడూర్లో 10.7℃గా నమోదైంది. మిగతా ప్రాంతాల్లోనూ చలి తీవ్రంగానే ఉంది.


