News February 10, 2025
గొండుపాలెం: డీసీసీబీ మాజీ డైరెక్టర్ మృతి

కే కోటపాడు పీఏసీఎస్ మాజీ అధ్యక్షులు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ బండారు వెంకన్న పాత్రుడు స్వగ్రామం అయిన గొండుపాలెంలో ఆదివారం ఆకస్మికంగా మరణించారు. పలువురు ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు తీవ్ర సానుభూతి తెలిపారు. పీఏసీఎస్ అధ్యక్షుడిగా, డీసీసీబీ డైరెక్టర్గా ఆయన రైతుల సంక్షేమానికి కృషి చేశారని పలువురు తెలిపారు.
Similar News
News November 18, 2025
పొగ మంచు వాతావరణంలో డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలి: ఎస్పీ

ప్రస్తుత శీతాకాలంలో పొగ మంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, డ్రైవర్లు కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని ములుగు ఎస్పీ శబరీశ్ అన్నారు. తెల్లవారుజామున, రాత్రివేళ సాధ్యమైనంతవరకు ప్రయాణాలను తగ్గించాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప రోడ్డు పక్కన భారీ వాహనాలు నిలప వద్దని అన్నారు. ఆ సమయంలో హాజర్ లైట్లను ఆన్ చేయాలని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలన్నారు.
News November 18, 2025
పొగ మంచు వాతావరణంలో డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలి: ఎస్పీ

ప్రస్తుత శీతాకాలంలో పొగ మంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, డ్రైవర్లు కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని ములుగు ఎస్పీ శబరీశ్ అన్నారు. తెల్లవారుజామున, రాత్రివేళ సాధ్యమైనంతవరకు ప్రయాణాలను తగ్గించాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప రోడ్డు పక్కన భారీ వాహనాలు నిలప వద్దని అన్నారు. ఆ సమయంలో హాజర్ లైట్లను ఆన్ చేయాలని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలన్నారు.
News November 18, 2025
విశాఖ: బాలోత్సవం-2025 పోస్టర్ ఆవిష్కరణ

ఆనందపురంలో డిసెంబర్ 9–11వ తేదీల్లో సెయింట్ ఆంథోనీ పాఠశాలలో జరగనున్న 3వ మహా విశాఖ బాలోత్సవం-2025 పోస్టర్ను DEO ఎన్.ప్రేమకుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బాలోత్సవం నిర్వాహకులు, సేవా సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. గత సంవత్సరం 8,000 కంటే ఎక్కువ మంది పిల్లలు పాల్గొన్న నేపథ్యంలో ఈసారి మరింత విస్తృతంగా నిర్వహించేందుకు విద్యాశాఖ పూర్తి సహకారం ప్రకటించింది.


