News July 20, 2024

గోదావరి వరద తీవ్రత పై సీఎం ఆరా..!

image

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గణనీయంగా పెరుగుతుండడంతో వరద తీవ్రతపై CM రేవంత్ రెడ్డి జిల్లా అధికారుల నుంచి ఆరా తీశారు. భారీ వర్షాల నేపథ్యంలో గోదావరికి వరద భారీగా వస్తున్న కారణంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. అలాగే పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. కాగా సెలవుల్లో కూడా ఉద్యోగులు విధుల్లో పాల్గొనాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

Similar News

News November 12, 2025

87% బిల్లులు డిజిటల్‌తోనే: ఖమ్మం ఎస్ఈ

image

TGNPDCL డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తేవడంతో, వినియోగదారులు ఆన్‌లైన్‌లో బిల్లులు చెల్లించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం 87% మంది టీజీఎన్‌పీడీసీఎల్ యాప్, గూగుల్ పే వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారానే బిల్లులు చెల్లిస్తున్నారని ఖమ్మం ఎస్ఈ శ్రీనివాస చారి తెలిపారు. తద్వారా కౌంటర్లకు వెళ్లే శ్రమ లేకుండా, సురక్షితంగా బిల్లులు చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు.

News November 12, 2025

వెలుగుమట్లలో సైనిక్ స్కూల్ అర్హతల పరిశీలన

image

ఖమ్మం జిల్లాలో సైనిక్ స్కూల్ ఏర్పాటు అర్హత పరిశీలనలో భాగంగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం వెలుగుమట్లలోని శ్రీ చైతన్య విస్టా పాఠశాలను పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం పిపిపి మోడ్‌లో దేశవ్యాప్తంగా 100 సైనిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని కలెక్టర్ తెలిపారు. ఖమ్మంలో దరఖాస్తు చేసిన ఈ పాఠశాల అర్హతను కమిటీ పరిశీలన ఆధారంగా నిర్ణయిస్తుందని అన్నారు.

News November 12, 2025

ఖమ్మం: దివ్యాంగుల పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం

image

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగుల సాధికారిత రాష్ట్ర పురస్కారాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా దివ్యాంగుల సంక్షేమశాఖ అధికారి రాంగోపాల్రెడ్డి తెలిపారు. అర్హులైన వ్యక్తులు, సంస్థలు ఆన్‌లైన్‌లో ఉన్న దరఖాస్తు ఫారాలు, మార్గదర్శకాలను ఉపయోగించుకోవాలని కోరారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 20వ తేదీలోపు కార్యాలయంలో సమర్పించాలి.