News March 17, 2025

జగిత్యాల: ప్రతి ఫిర్యాదును ఎప్పటికప్పుడు సమీక్షిస్తాం: ఎస్పీ

image

జగిత్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌డేలో వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిష్కరిస్తామని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన 14 మంది వివిధ సమస్యలపై ఫిర్యాదు చేశారన్నారు. ఫిర్యాదు లేఖలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

Similar News

News March 18, 2025

మహబూబాబాద్‌: నిలిచిన పలు రైళ్లు..!

image

సాంకేతిక సమస్య తలెత్తి మహబూబాబాద్ జిల్లా గుండ్రాతిమడుగు రైల్వే స్టేషన్ శివారులో ఓ గూడ్స్ రైలు నిలిచిపోయింది. దీంతో కాజీపేట వైపు వెళ్లే పలు రైళ్లు ఆలస్యంగా వెళ్లాయి. గుండ్రతిమడుగు వద్ద తమిళనాడు ఎక్స్‌ప్రెస్, గార్ల రైల్వే స్టేషన్‌లో ఏపీ ఎక్స్‌ప్రెస్, డోర్నకల్ రైల్వే స్టేషన్‌లో కాకతీయ ప్యాసింజర్ నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

News March 18, 2025

పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా..!

image

పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా ముత్తారం 40.1℃ నమోదు కాగా మంథని 40.1, రామగిరి 40.0, అంతర్గం 40.0, కాల్వ శ్రీరాంపూర్ 39.8, రామగుండం 39.7, ఓదెల 39.7, పాలకుర్తి 39.6, కమాన్పూర్ 39.3, సుల్తానాబాద్ 38.4, ధర్మారం 38.3, పెద్దపల్లి 36.6, ఎలిగేడు 35.7, జూలపల్లి 35.4℃ గా నమోదయ్యాయి. ఇక 10 దాటితే జిల్లాలో ఎండ తీవ్రత భారీగా పెరుగుతుంది.

News March 18, 2025

కడియం: బాలికతో అసభ్యకర ప్రవర్తన.. పోక్సో కేసు నమోదు

image

కడియం మండలంలోని ఓ గ్రామానికి చెందిన చిన్న(60) మనవరాలు వరుసయ్యే బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని బాధిత బాలిక ఫిర్యాదు చేసిందన్నారు. తండ్రి అనారోగ్యంతో చనిపోగా.. తల్లి వేరే దేశంలో ఉంటోంది. బంధువుల ఇంటి వద్ద ఉంటున్న బాలికపై సదరు వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడన్నారు.

error: Content is protected !!