News March 13, 2025

దోమ: ఘోర రోడ్డు ప్రమాదం.. హాస్పిటల్‌కు తరలింపు

image

దోమ మండలం మైలారం గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గొడుగోనిపల్లి నుంచి మోత్కూర్ వెళ్లే రోడ్డులో కోళ్ల ఫారం దగ్గర మోత్కూర్ గ్రామానికి చెందిన సండి సాయికుమార్, ధన్ రాజ్ అనే వ్యక్తులు బైక్‌తో ట్రాక్టర్‌కు ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పరిగి ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించగా.. అక్కడి నుంచి వికారాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

Similar News

News March 13, 2025

ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం

image

AP: రాష్ట్రంలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. జనసేన నుంచి నాగబాబు, టీడీపీ నుంచి బీటీ నాయుడు, కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీజేపీ నుంచి సోము వీర్రాజు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.

News March 13, 2025

చాహల్‌తో డేటింగ్ రూమర్స్: ఆర్జే మహ్వాష్ పోస్ట్ వైరల్

image

టీమ్ ఇండియా క్రికెటర్ యజ్వేంద్ర చాహల్‌తో డేటింగ్ రూమర్స్ వేళ ఆర్జే మహ్వాష్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘నేను ఈ స్థాయికి రావడం చూసి చిన్ననాటి మహ్వాష్ ఎంతో గర్విస్తోంది. నాకు కావాల్సింది కూడా ఇదే. మనం ఏ తప్పు చేయకుండా, అనవసర విషయాలు పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు సాగాలి’ అని పోస్టులో రాశారు. డేటింగ్‌పై వస్తున్న రూమర్స్‌పైనే ఆమె ఈ పోస్ట్ పెట్టినట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

News March 13, 2025

నెల్లూరు: నిరుద్యోగులకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు

image

ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎనర్జీ సిస్టం, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ, డిప్లమా విద్యార్హత కలిగిన నిరుద్యోగ యువతకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కలవని ఏపీ స్కిల్ డెవలప్మెంట్ జిల్లా మేనేజర్ అబ్దుల్ ఖయ్యూం తెలిపారు. 18 నుంచి 40 ఏళ్ల వయసు కలిగిన నిరుద్యోగులు అర్హులని అన్నారు. మరింత సమాచారం కోసం కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

error: Content is protected !!