News September 18, 2024
నరసన్నపేట: వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం

నరసన్నపేట మండలం దూకులపాడు పంచాయతీ తండ్యాలవానిపేటకు చెందిన శిమ్మ దివ్య అత్తింటి వేధింపులు కారణంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు హుటాహుటిన నరసన్నపేటలోని ఓ స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి మంగళవారం రాత్రి తరలించారు. దివ్య తల్లి ఆదిలక్ష్మి నరసన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఎస్సై దుర్గా ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టమన్నారు.
Similar News
News December 10, 2025
SKLM: ‘మనిషి జీవించడానికి మానవ హక్కులు మూలం’

మనిషి జీవించడానికి మానవ హక్కులు మూలమని జిల్లాకోర్టు న్యాయ సేవాధికారి సంస్థ ప్రధాన కార్యదర్శి కే. హరిబాబు పేర్కొన్నారు. శ్రీకాకుళం మెప్మా కార్యాలయంలో బుధవారం ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం నిర్వహించారు. సమానత్వం, స్వేచ్ఛ, మానవ గౌరవాలకు ఈ చట్టాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. వీటిని తెలుసుకొని సమాజంలో గౌరవంగా నడుచుకోవాలన్నారు. మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటరావు ఉన్నారు.
News December 10, 2025
సిక్కోలు నేతల మౌనమేలనో..?

ఇండిగో సంక్షోభంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును వైసీపీ టార్గెట్ చేస్తోంది. ఇండిగో సంక్షోభానికి రామ్మోహన్ నాయుడే కారణమని ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ తదితరులు కేంద్ర మంత్రిపై విమర్శలు చేస్తున్నారు. ఈ అంశంపై జిల్లాలో అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతలు పెద్దగా స్పందించకపోవడంపై రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతుంది.
News December 10, 2025
ఇండిగో సంక్షోభంపై సిక్కోలు నేతలు మౌనం

ఇండిగో సంక్షోభంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును వైసీపీ టార్గెట్ చేస్తుంది. ఇండిగో సంక్షోభానికి రామ్మోహన్ నాయుడే కారణమని ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాధ్ తదితరులు కేంద్ర మంత్రిపై విమర్శలు చేస్తున్నారు. ఈ అంశంపై జిల్లాలో అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతలు పెద్దగా స్పందించకపోవడంపై రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతుంది.


