News September 18, 2024

నరసన్నపేట: వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం

image

నరసన్నపేట మండలం దూకులపాడు పంచాయతీ తండ్యాలవానిపేటకు చెందిన శిమ్మ దివ్య అత్తింటి వేధింపులు కారణంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు హుటాహుటిన నరసన్నపేటలోని ఓ స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి మంగళవారం రాత్రి తరలించారు. దివ్య తల్లి ఆదిలక్ష్మి నరసన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఎస్సై దుర్గా ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టమన్నారు.

Similar News

News December 12, 2025

SKLM: జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు

image

జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నామని సర్కిల్ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి గురువారం ప్రకటనలో తెలిపారు.ఇంధన పొదుపు ఆవశ్యకతను వినియోగదారులకు మరింత తెలిసేలా అవగాహన కల్పించేలా నిర్వహిస్తామన్నారు. ఈ వారోత్సవాలను శ్రీకాకుళం, టెక్కలి, పలాస డివిజన్ కేంద్రాల్లో విద్యుత్ పొదుపు అవగాహన ర్యాలీలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

News December 12, 2025

శ్రీకాకుళం: SI ట్రైనింగ్ పూర్తయ్యినా పోస్టింగులు లేవు

image

ట్రైనింగ్ పూర్తిచేసుకున్న SIలకు పోస్టింగులు ఇవ్వకపోవడంపై విశాఖ రేంజ్‌లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని 4 రేంజ్‌లలో ఇప్పటికే పోస్టింగులు ఇచ్చినా.. విశాఖ రేంజ్‌కే జాప్యం కొనసాగుతోంది. డిసెంబర్ 5తో ట్రైనింగ్ పిరియడ్ పూర్తయింది. విశాఖ రేంజ్‌లో మొత్తం 49 మంది SIలకు ట్రైనింగ్ పూర్తైనా ఇప్పటి వరకు పోస్టింగ్ ఇవ్వలేదు. మరోపక్క నగరంలో పోలీసు సిబ్బంది కొరత ఉండటంతో లా అండ్ ఆర్డర్‌కు కష్టమౌతోంది.

News December 12, 2025

రైతుల సమస్యలపై శ్రీకాకుళం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ధాన్యం సేకరణ, ఎరువులు సంబంధించి సమస్యలపై కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఓ ప్రటన విడుదల చేశారు. రైతులకు ఏదైనా సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్ నంబర్ 9121863788 ఫోన్ చేసి తెలుసుకోవాలని స్పష్టం చేశారు. రైతుల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.