News February 7, 2025
పిడుగురాళ్ల: ఐదు నెలల తర్వాత రీపోస్టు మార్టం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738895407268_51664167-normal-WIFI.webp)
గత ఏడాది మృతిచెందిన మారం పున్నమ్మ మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించిన ఘటన పిడుగురాళ్ల బెల్లంకొండ డొంక పొలంలో గురువారం జరిగింది. ఎస్ఐ మోహన్ కథనం ప్రకారం.. మృతిచెందిన పున్నమ్మ కుమారుడు ఫిర్యాదు మేరకు రీపో స్టుమార్టం నిర్వహించాల్సి వచ్చిందని అన్నారు. కోర్టు ఆదేశాలతో పొలంలో ఉన్న సమాధిని తవ్వి మృతదేహాన్ని వెలికి తీసి, తహశీల్దార్ మధుబాబు పర్యవేక్షణలో రీ పోస్టు మార్టం నిర్వహించారు.
Similar News
News February 7, 2025
కోడిగుడ్డుపై అపోహలు.. వైద్యులేమన్నారంటే?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738919104517_746-normal-WIFI.webp)
కోడిగుడ్డులో వైట్ మాత్రమే తినాలా? ఎల్లో తినొద్దా? అని చాలా మందికి సందేహం ఉంటుంది. అలాంటి వారికి డా.మోహన వంశీ క్లారిటీ ఇచ్చారు. ‘బరువు తగ్గాలి అనుకునేవారికి ఎగ్ వైట్ ఎంతో మంచిది. అదే ఎల్లోలో A,D,E,B12 అనే విటమిన్లు, ఐరన్ వంటి మినరల్స్ ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తి, ఎనర్జీ కోసం చాలా అవసరం. ఎగ్స్ న్యూట్రిషన్ రిచ్ ఫుడ్. ఎలా తిన్నా మీ ఆహారంలో తప్పకుండా ఉండేలా చూసుకోండి’ అని తెలిపారు. SHARE IT
News February 7, 2025
కుటుంబంతో రాష్ట్రపతి భవన్ను సందర్శించిన సచిన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738919517073_746-normal-WIFI.webp)
ఢిల్లీ రాష్ట్రపతి భవన్లోని అతిథి గృహాన్ని కుటుంబంతో కలిసి సందర్శించడం తనకు దక్కిన గౌరవమని మాస్టార్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నారు. ‘రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అందించిన ఆతిథ్యం దీనిని మరింత ప్రత్యేకం చేసింది. విందులో హృదయపూర్వక సంభాషణలు నన్ను మరింత ప్రభావితం చేశాయి. ఈ అనుభవాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. రాష్ట్రపతి భవన్ను సందర్శించి దాని గొప్పతనం, వారసత్వాన్ని తెలుసుకోండి’ అని తెలిపారు.
News February 7, 2025
ట్విస్ట్.. టీమ్ఇండియా కెప్టెన్గా హార్దిక్?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738911997697_893-normal-WIFI.webp)
టీమ్ ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యకు ODI, T20 కెప్టెన్సీ ఇవ్వాలని BCCI యోచిస్తున్నట్లు నేషనల్ మీడియా పేర్కొంది. బాగా రాణిస్తున్నప్పటికీ అతడికి అన్యాయం జరుగుతోందనే భావనలో కోచ్ గంభీర్, బోర్డు అధికారులున్నట్లు సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవకపోతే ODIలకు హార్దిక్ను కెప్టెన్ చేయాలని, T20ల్లో సూర్య బ్యాటింగ్లో విఫలమవుతున్న నేపథ్యంలో ఆ పగ్గాలు కూడా పాండ్యకే ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.