News February 7, 2025

కోడిగుడ్డుపై అపోహలు.. వైద్యులేమన్నారంటే?

image

కోడిగుడ్డులో వైట్ మాత్రమే తినాలా? ఎల్లో తినొద్దా? అని చాలా మందికి సందేహం ఉంటుంది. అలాంటి వారికి డా.మోహన వంశీ క్లారిటీ ఇచ్చారు. ‘బరువు తగ్గాలి అనుకునేవారికి ఎగ్ వైట్‌‌ ఎంతో మంచిది. అదే ఎల్లోలో A,D,E,B12 అనే విటమిన్లు, ఐరన్ వంటి మినరల్స్ ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తి, ఎనర్జీ కోసం చాలా అవసరం. ఎగ్స్ న్యూట్రిషన్ రిచ్ ఫుడ్. ఎలా తిన్నా మీ ఆహారంలో తప్పకుండా ఉండేలా చూసుకోండి’ అని తెలిపారు. SHARE IT

Similar News

News March 19, 2025

పాత ఫోన్.. గంటకు పైగా ఛార్జ్ చేస్తే పేలే ప్రమాదం

image

పాత ఫోన్లు కొనొద్దని నిపుణులు సూచిస్తున్నారు. వాటిలోని చెడిపోయిన బ్యాటరీ స్థానంలో క్వాలిటీ లేని చైనా బ్యాటరీని అమర్చుతారని చెబుతున్నారు. అలాంటి బ్యాటరీని గంటకు పైగా ఛార్జ్ చేస్తే వేడెక్కి పేలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అలాగే ఫోన్‌ను ఎక్కువ సేపు ప్లగ్ ఇన్ చేసి ఉంచకూడదంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ రాజ్‌గఢ్ జిల్లాలో సెకండ్ హ్యాండ్ మొబైల్ పేలి ఓ యువకుడికి తీవ్రగాయాలయ్యాయి.

News March 19, 2025

సునీత.. మీరు పట్టుదల అంటే ఏంటో చూపించారు: మోదీ

image

ISS నుంచి భూమిపైకి తిరిగొచ్చిన సునీతా విలియమ్స్, ఇతర వ్యోమగాములను PM మోదీ ప్రశంసించారు. ‘వెల్కమ్ బ్యాక్ crew9. మిమ్మల్ని భూమి చాలా మిస్ అయింది. పట్టుదల అంటే ఏంటో చూపించారు. ఎంతో మందికి మీరు స్ఫూర్తి. అంతరిక్ష అన్వేషణ అంటే సామర్థ్యానికి మించి సరిహద్దుల్ని దాటుకుని వెళ్లడం, కలల్ని నిజం చేసుకునే ధైర్యం ఉండటం. సునీత ఒక ఐకాన్. వారిని సురక్షితంగా తీసుకొచ్చిన వారి పట్ల గర్వంగా ఉన్నాం’ అని ట్వీట్ చేశారు.

News March 19, 2025

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

image

TG: బడ్జెట్‌లో రైతు భరోసాకు రూ.18 వేల కోట్లు కేటాయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఇక ఏడాదికి ఎకరానికి రూ.12 వేల చొప్పున అందుతాయని చెప్పారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా రైతు భరోసా అందిస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం బడ్జెట్‌గా రూ.24,439 కోట్లు కేటాయించడం గమనార్హం. ఇప్పటికే మూడు ఎకరాల లోపు వారికి రైతు భరోసా నగదు జమ చేసిన సంగతి తెలిసిందే.

error: Content is protected !!