News October 9, 2024

మదనపల్లె జిల్లా ఇప్పుడే కాదు: చంద్రబాబు

image

కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 30 జిల్లాలుగా మారుస్తామనే ప్రచారంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. మదనపల్లె, మార్కాపురం జిల్లాపై తాము హామీలు ఇచ్చామన్నారు. ఆయా జిల్లాలు కూడా ఇప్పుడే ఏర్పాటు చేయబోమని తెలిపారు. ఎన్నికలకు ముందే పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరుతో కలిపి మదనపల్లె జిల్లా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Similar News

News April 14, 2026

చిత్తూరు జిల్లా ‘మండుతోంది’

image

చిత్తూరు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. సోమవారం ఏడు మండలాల్లో దాదాపు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు దాటాయి. అత్యధికంగా తవణంపల్లెలో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నగరి, రొంపిచెర్లలో 40.7, శ్రీరంగరాజపురంలో 40.6, నిండ్రలో 40.5, గంగవరంలో 40.3, విజయపురంలో 40.0, పెద్దపంజాణిలో 39.6, బంగారుపాళ్యం, పులిచెర్ల మండలాల్లో 39.5 డిగ్రీల టెంపరేచర్ నమోదయింది.

News April 14, 2026

చిత్తూరు జిల్లాలో నేటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు

image

చిత్తూరు జిల్లాలో మంగళవారం నుంచి ఈనెల 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా అగ్నిమాపక అధికారి పెద్దిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వారోత్సవాల్లో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రులు, అపార్టుమెంట్లు, బహిరంగ ప్రదేశాల్లో అగ్నిప్రమాదాల నివారణపై మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. తద్వారా ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.

News April 14, 2026

ప్రతి పీహెచ్సీకి ఇంటర్నెట్ సదుపాయం : కలెక్టర్

image

చిత్తూరు జిల్లాలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఇంటర్నెట్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ హామీ ఇచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లో చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గంలోని పీహెచ్సీ స్టాఫ్ నర్సులతో కలెక్టర్ సమీక్షించారు. అబా ఐడీ నమోదుకు ఆరోగ్య సిబ్బంది ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో రూ. 25 వేల తన సొంత నిధులతో ప్రత్యేక ఇంటర్నెట్ సదుపాయాన్ని ఉచితంగా ఏర్పాటు చేస్తామన్నారు.