News March 28, 2025

యాత్రలు విద్యార్థుల అభివృద్ధికి దోహదం చేస్తాయి: కలెక్టర్

image

బాపట్ల జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలలో 8, 9 తరగతులు చదువుతున్న విద్యార్థులకు విజ్ఞాన శాస్త్ర యాత్రను బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజ్ఞాన విహారయాత్రలు విద్యార్థుల అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. పాఠశాలలో కార్యక్రమాలకు భిన్నంగా విజ్ఞాన యాత్రలు విజ్ఞానాన్ని, వినోదాన్ని కలిగిస్తాయని అన్నారు.

Similar News

News April 6, 2025

జాగ్వార్ ఎగుమతుల నిలిపివేత

image

టాటాకు చెందిన ‘జాగ్వార్ ల్యాండ్‌రోవర్’ (JLR) సంస్థ తమ లగ్జరీ కార్లను బ్రిటన్‌లో ఉత్పత్తి చేస్తుంటుంది. బ్రిటన్‌ ఉత్పత్తులపై ట్రంప్ 25శాతం సుంకాన్ని విధించిన నేపథ్యంలో USకు కార్ల ఎగుమతిని నిలిపేయాలని ఆ సంస్థ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘ది టైమ్స్’ కథనం ప్రకారం.. నెల రోజుల పాటు తమ నిర్ణయాన్ని అమలుచేయాలని JLR యోచిస్తోంది. 2 నెలలకు సరిపడా ఎగుమతుల్ని ఇప్పటికే USకు పంపించినట్లు సమాచారం.

News April 6, 2025

మహబూబ్‌నగర్‌లో నేడు చికెన్, మటన్ షాపులు బంద్

image

శ్రీరామ నవమిని పురస్కరించుకుని మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆదివారం చికెన్, మటన్, చేపలు తదితర మాంసం దుకాణాలు మూసివేయాలని కమిషనర్ మహేశ్వర్ రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎవరైనా మున్సిపాలిటీ హెచ్చరికలను బేఖాతరు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలంతా ఈ విషయాన్ని గమనించి మున్సిపాలిటీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. SHARE IT

News April 6, 2025

వనపర్తిలో శవం కలకలం..!

image

డ్రైనేజ్ కాలువలో పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. వనపర్తి 20వ వార్డుకు చెందిన కార్ డ్రైవర్ శ్రీను(46) శనివారం సాయంత్రం రామా టాకీస్ ఎదురుగా ఉన్న డ్రైనేజీ కాలువలో పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!