News December 29, 2024
రాష్ట్రపతి భవన్లో JAN-2 నుంచి సందర్శకులకు ప్రవేశం

బొల్లారంలోని రాష్ట్రపతి భవన్లో జనవరి 2 నుంచి 13 వరకు సందర్శకులకు ప్రవేశం కల్పించనున్నారు. ఈసారి ఉద్యాన్ ఉత్సవ్ – పుష్పాలు, హార్టికల్చర్ పండుగను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్వహించనున్నారు. సుమారు 50 స్టాల్తో గ్రాండ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నారు. సాయంత్రం 4గంటల నుంచి 8 గంటల వరకు వివిధ కళారూపాలను ప్రదర్శిస్తారు.
Similar News
News November 3, 2025
HYD: మృతులకు రూ.7 లక్షల ఎక్స్గ్రేషియా: మంత్రి

చేవెళ్ల మండలం మీర్జాగూడలో జరిగిన బస్సు ప్రమాదం దురదృష్టకరమని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.7 లక్షలు ప్రకటిస్తూ, బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే CM రేవంత్ రెడ్డి స్పందించి మంత్రులు, అధికారులను అప్రమత్తం చేశారని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్, RR జిల్లా కలెక్టర్ C.నారాయణ రెడ్డి ప్రమాద స్థలానికి వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించారు.
News November 3, 2025
మీర్జాగూడ యాక్సిడెంట్.. 19 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి

బస్సు ప్రమాద ఘటనలో 19 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. ఉస్మానియా ఆస్పత్రికి చెందిన 12 మంది వైద్యుల బృందం పోస్టుమార్టం చేశారు. 18 మృతదేహాలను వారి కుటుంబాలకు డాక్టర్లకు అప్పగించారు. టిప్పర్ డ్రైవర్ ఆకాశ్ కాంబ్లీ మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగించి, అంబులెన్స్లో నాందేడ్కు తరలించారు.
News November 3, 2025
పిల్లలను అనాథలుగా మార్చిన మీర్జాగూడ ప్రమాదం

మీర్జాగూడ ప్రమాదం ఆ పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చింది. యాలాల మండలం హాజీపూర్కు చెందిన బందప్ప-లక్ష్మి దంపతులు. వీరికి భవానీ, శివాలీ(ఆడబిడ్డలు) సంతానం. సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందారు. అమ్మ-నాన్నను కోల్పోయిన పిల్లలు అనాథలుగా మిగిలారు. ఇప్పటికే పేదరికంలో ఉన్న ఆ ఫ్యామిలీ పెద్ద దిక్కును కోల్పోయింది. చేవెళ్ల ఆస్పత్రి ఆవరణలో పిల్లల కన్నీరు అందరినీ కలచివేసింది.


