News February 12, 2026
రీసర్వే, పాస్పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలి: జేసీ

రీసర్వే పనులు, పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీని వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం జరిగిన వీసీలో రీసర్వే, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని సమీక్షించారు. పెండింగ్ ఖాతాలు త్వరగా క్లియర్ చేసి, మ్యూటేషన్లు వేగంగా చేయాలన్నారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి ఇంకా 4,765 ఖాతాలు పెండింగ్ ఉండటం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు.
Similar News
News March 9, 2026
VZM: కలెక్టరేట్లో నేడు PGRS కార్యక్రమం

విజయనగరం జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం విజయనగరం కలెక్టరేట్లో PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం 1 వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని అర్జీలను స్వీకరిస్తారన్నారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లోనూ అర్జీల స్వీకరణ ఉంటుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
News March 9, 2026
VZM: కలెక్టరేట్లో నేడు PGRS కార్యక్రమం

విజయనగరం జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం విజయనగరం కలెక్టరేట్లో PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం 1 వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని అర్జీలను స్వీకరిస్తారన్నారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లోనూ అర్జీల స్వీకరణ ఉంటుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
News March 8, 2026
VZM: అండర్-13, 18 క్రీడాకారుణులకు పరుగు పందెం పోటీలు

మహిళా దినోత్సవం సందర్భంగా మై భారత్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు ఆదివారం బాబామెట్టలోని విజ్జీ స్టేడియంలో జరిగాయి. అండర్-13, 18 18 ఏళ్లు పైబడిన విభాగాల్లో 100, 200, 400 మీటర్ల పరుగు పందెం పోటీలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల నుంచి విద్యార్థినులు పాల్గొన్నారు. విజేతలకు పతకాలు, సర్టిఫికెట్లను అందజేశారు.


