News February 27, 2026

విజయనగరం: సైకో కిల్లర్ ఉపేంద్ర బాబు హత్య

image

అనకాపల్లి(D) మాడుగుల(M) జంపినకు చెందిన సీరియల్ సైకో కిల్లర్ పెచ్చేటి ఉపేంద్ర బాబును గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఉపేంద్ర బాబు ఐదు మర్డర్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇటీవల విజయనగరం జిల్లాలో చేసిన దొంగతనం కేసులో జైలుకు వెళ్లి, బెయిల్ మీద బయటకు వచ్చాడు. కాగా మారణాయుధాలతో ఉపేంద్ర బాబును హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్నివివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 13, 2026

200 మందికి డ్రంక్ అండ్ డ్రైవ్‌ కేసులో జైలు: ఎస్పీ

image

మద్యం తాగి డ్రైవింగ్ చేసే వారికి ఫైన్లతో పాటు జైలు శిక్ష తప్పదని జిల్లా ఎస్పీ ఏఆర్.దామోదర్ హెచ్చరించారు. రామభద్రపురం పోలీసు స్టేషన్‌ను ఆదివారం ఆయన సందర్శించారు. జిల్లాలో ఇప్పటివరకు 200 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జైలు శిక్షలు వేసినట్లు తెలిపారు. రహదారి ప్రమాదాల నివారణకు అధిక ప్రాధాన్యతనిస్తూ వాహన చట్టాలను పక్కాగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

News April 12, 2026

VZM: కలెక్టరేట్‌లో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటలకు విజయనగరంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. భూ సమస్యల కోసం ప్రత్యేకంగా ‘రెవెన్యూ క్లినిక్’ కూడా నిర్వహిస్తామన్నారు. కలెక్టరేట్‌కి రాలేని వారు 1100 టోల్ ఫ్రీ నంబర్/ meekosam.ap.gov.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ సూచించారు.

News April 12, 2026

విజయనగరం వైద్య కళాశాలలో కొత్త అధ్యాయం!

image

విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాల మొదటి బ్యాచ్ పీజీ విద్యార్థుల ఓరియెంటేషన్ శనివారం ముగిసింది. జనరల్ మెడిసిన్, సర్జరీ, ప్రసూతి, పిల్లల వైద్యం వంటి విభాగాల్లో 20 మంది విద్యార్థులు చేరారు. ముగింపు వేడుకలో డా. పి.వి. సుధాకర్ హాజరై “కలలను నిజం చేసుకునే దిశగా” అనే అంశంపై ప్రసంగించారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. కొత్త విద్యార్థుల రాకతో కళాశాలలో కోలాహలం నెలకొంది.