News August 30, 2024

శ్రీకాకుళం: అదనపు ఎరువుల కోసం ఆదేశాలు జారీ

image

ఇటీవల శ్రీకాకుళం జిల్లా జడ్పీ సమావేశ మందిరంలో ప్రజా ప్రతినిధులు అధికారుల సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు ఎరువుల కొరత అంశాన్ని ప్రస్తావించడంతో స్పందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మార్క్ ఫెడ్ ఉన్నాతధికారులను గురువారం ఆదేశించారు. జిల్లాకు 820 టన్నుల డిఏపి, 760 టన్నుల యూరియా సరఫరాకు చర్యలు చేపట్టారు. శుక్రవారం నుంచే రైతులకు పంపిణీ చేయాలన్నారు.

Similar News

News November 14, 2025

SKLM: ‘బాలలు చెడి వ్యసనాలకు బానిస కావద్దు’

image

బాలలు చెడు వ్యసనాలకు బానిస కావద్దని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ప్రధాన కార్యదర్శి హరిబాబు పేర్కొన్నారు. శ్రీకాకుళం ఉమెన్స్ కాలేజీ గ్రౌండ్ ఆడిటోరియంలో బాలలదినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. విద్యను చక్కగా అభ్యసించి దేశానికి ఉపయోగపడే భావిపౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. సెల్ ఫోన్లకు దూరంగా ఉండి ఉన్నత ఆశయాలతో మంచి ఉద్యోగాలు సంపాదించాలన్నారు. DSP వివేకానంద, ప్రిన్సిపల్ కృష్ణవేణి, అధికారులు ఉన్నారు.

News November 14, 2025

నౌకా నిర్మాణ హబ్‌‌గా విశాఖ-శ్రీకాకుళం కారిడార్‌: CM

image

విశాఖలో గురువారం జరిగిన సీఐఐ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌–2025లో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. విశాఖ-శ్రీకాకుళం కారిడార్‌ను నౌకా నిర్మాణ హబ్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. భోగాపురం విమానాశ్రయం పరిధిలో ఏరో సిటీని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. 9 జిల్లాలతో కూడిన విశాఖ ఎకనామిక్ రీజియన్ అథారిటీకి ఛైర్మన్ హోదాలో తానే స్వయంగా పర్యవేక్షిస్తానని సీఎం పేర్కొన్నారు.

News November 14, 2025

SKLM: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందరికీ రుణాలు అందజేస్తాం

image

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందరికీ రుణాలు అందజేస్తామని ఏపీ మాదిగ వెల్ఫేర్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ ఉండవల్లి శ్రీదేవి పేర్కొన్నారు. గురువారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. NSFC కింద 450 రుణాలుకు 3 వేల దరఖాస్తులందయాని ఆమె వివరించారు. రూ 1.80 కోట్లు మాత్రమే మంజూరయ్యాయని త్వరలో ఎంపిక చేసి రుణాలు ఇస్తామన్నారు. అధికారులు గడ్డమ్మ సుజాత పాల్గొన్నారు.